తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
యువ నాయకులకు ఘన సన్మానం చేసిన రాష్ట్ర సంఘం ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు
తొర్రూర్ మున్సిపాలిటీలో మన పెరిక కులానికి చెందిన యువ నాయకులు తునం శ్రవణ్ గారు మున్సిపల్ చైర్మన్గా, ముద్దసాని సురేష్ గారు కౌన్సిలర్ గా విజయం సాధించి మన కుల సమాజ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. వీరు ఇరువురికి ఈరోజు శుక్రవారం సూర్యాపేట పెరిక కుల సంఘం అధ్యక్షుడు బందు శ్రీధర్ బాబు ఘన సన్మానం చేశారు.
తునం శ్రవణ్, ముద్దసాని సురేష్ లతో రాష్ట్ర సంఘం అధ్యక్షులు ఘటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు మద్ద లింగయ్య గారు మాట్లాడి శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా పెరిక కుల సంఘం మాజీ అధ్యక్షులు, పెద్దముప్పారం గ్రామ సర్పంచ్ కందిమల్ల భరత్ బాబు, మహబూబాబాద్ జిల్లా సంఘం నాయకులు సందెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.