తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
కుల పెద్దలు, కుల బంధువుల సమక్షంలో భూ యజమాని నుండి రిజిస్ట్రేషన్ పత్రాలు స్వీకరించిన వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అచ్చ రఘు కుమార్.
డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు అధ్యక్షులుగా విద్యార్థి వసతి గృహ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించగానే కుల పెద్దల సహకారంతో మహిళా వసతి గృహం కోసం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కు అతి సమీపంలో మార్కెట్ ధర కంటే అత్యంత తక్కువ ధరలో 395.5గజాల స్థలం ఖరీదు చేసి ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ స్థల పరిశీలన మొదలుకొని రిజిస్ట్రేషన్ పూర్తయ్యేంతవరకు వసతి గృహ అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అచ్చ రఘు కుమార్, కోశాధికారి బాల్దూరి రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి అంకతి విజయకుమార్లు స్థలం కొనుగోలు విషయంలో విశేష కృషి చేసారు, ఒక మంచి స్థలం నిర్ధారణ చేయడానికి కమిటీ వేసి రాష్ట్ర అధ్యక్షుడు మద్దాలింగయ్య, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ ఘటిక విజయ్ కుమార్ ఇంకా కుల పెద్దలు ఉన్న కమిటీ పలు స్థలాలు పరిశీలన చేసి ఎల్బీనగర్ మెట్రో కు అతి సమీపంలో ఉన్న ఈ స్థలం మహిళా వసతిగృహానికి అనుకూలంగా ఉంటుందని భావించి యజమానులతో సంప్రదించి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి ఈరోజు బుధవారం (08-10-25)భూ యజమాని నుండి రిజిస్ట్రేషన్ పత్రాలు స్వీకరించారు. ఈరోజు చివరి వాయిదా చెల్లించడంతో భూ యజమాని రంగారెడ్డి జిల్లా, సరూర్ నగర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి సంబంధిత డాక్యుమెంట్స్ కుల పెద్దలకు అందజేశారు. దీంతో హైదరాబాద్ మహానగరంలో 4 వ పెరిక భవన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది.మొదటగా హైదరాబాద్ నడిబొడ్డున ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతి గృహం,
రెండవ పెరిక భవన్ ఉప్పల్ లో ఉండగా,
మూడవది అత్యంత ప్రతిష్టాత్మకంగా కోకాపేటలో పెరిక భవన్ నిర్మితమవుతున్న విషయం తెలిసిందే,ప్రస్తుతం ఖరీదు చేసిన స్థలంలో మహిళా వసతి గృహం కోసం నాలుగో పెరిక భవన్ నిర్మాణానికి హాస్టల్ కమిటీ ప్రయత్నాలు త్వరలో ప్రారంభిస్తుంది. ఈ స్థలం గుర్తించడం నుండి అత్యంత తక్కువ ధరకు స్థలం వచ్చేందుకు విశేషంగా కృషి చేసిన ప్రముఖ రియల్టర్, వసతి గృహం వైస్ ప్రెసిడెంట్ దొంగరి శంకర్ గారికి ఈ సందర్బంగా హాస్టల్ కార్యవర్గం, కుల పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ఇంకా రాష్ట్ర అధ్యక్షులు మద్దాలింగయ్య, పూర్వ వసతి గృహ అధ్యక్షులు, పెద్దలు దాసరి మల్లేశం, కోకాపేట భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు గటిక విజయ్ కుమార్, సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి వలిశెట్టి లక్ష్మి శేఖర్, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్,రాష్ట్ర సంఘం ఆర్థిక కార్యదర్శి దొంగరి మనోహర్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరి వీరభాస్కర్, రాష్ట్ర నాయకులు దొంగరి శంకర్, భవన నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల బాలరాజ్ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బోలిశెట్టి సతీష్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రామినేని వెంకటేశ్వర్లు,ఎల్ బి నగర్ సభ్యులు దివి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పెరిక విద్యార్థి వసతి గృహం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎల్. బి. నగర్ లో బాలికల హాస్టల్ నిర్మాణం కోసం 2025 నవంబర్ 7న ఘనంగా శంకుస్థాపన జరిగింది. హాస్టల్ అధ్యక్షుడు దొంగరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, కోకాపేట భవన కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్, మాజీ అధ్యక్షులు దాసరి మల్లేశం, శ్రీరాం దయానంద్, పెరిక హాస్టల్ మాజీ అధ్యక్షులు బొలిశెట్టి వీరయ్య, పెరిక విద్యార్థి వసతి గృహం స్థాపక ధర్మకర్త ఎడమ నర్సింగ్ రావు, పివివిజి ప్రధాన కార్యదర్శి అచ్చ రఘుకుమార్, కోశాధికారి బాల్దురి రవి కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అంకతి విజయ్ కుమార్, నాయకులు బొలిశెట్టి సతీష్, వాసుదేవరావు, కుంచాల బాలరాజు శ్రీనివాస్, దిడ్డి సురేష్, బుద్దె వెంకటేశ్వర్లు, సుంకరి ఆనంద్, గుండు వెంకటేశ్వర్లు, మైలారుశెట్టి చైతన్య, దొంగరి శంకర్, ఎర్రంశెట్టి రవీందర్, బొలిశెట్టి నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లోని ఎల్.బి. నగర్ ప్రాంతంలో పెరిక విద్యార్థి వసతి గృహం బాలికల హాస్టల్ నిర్మించడానికి స్థలం కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం 2025 అక్టోబర్ 23న పెరిక హాస్టల్ లో జరిగింది. మొత్తం 395.5 గజాల స్థలాన్ని రూ.2,22,50,00 కొనుగోలు చేయడానికి ఒప్పందం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు మద్దా లింగయ్య, కోకాపేట ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్, నాయకులు దాసరి మల్లేశం, శ్రీరాం దయానంద్, దొంగరి శంకర్, దొంగరి మనోహర్, సుందరి వీరభాస్కర్, కుంచాల బాలరాజు శ్రీనివాస్, వలిశెట్టి లక్ష్మిశేఖర్, సుంకరి ఆనంద్, చుంచు ఊశన్న, దిడ్డి సురేశ్ తదితరులు పాల్గొన్నారు
కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్, పివివిజి ప్రధాన కార్యదర్శి అచ్చ రఘు కుమార్ అంతకుముందు బెంగులూరు వెళ్లి స్థల యజమానులతో చర్చించి, స్థలం కొనుగోలుకు ఒప్పించడం జరిగింది.
ఎల్బీనగర్ ప్రాంతంలో నిర్మించబోయే బాలికల హాస్టల్ కోసం ఈరోజు అనగా 19 మార్చి 2026న టెండర్ నోటీసు ఇవ్వడం జరిగింది. ఈనాడు దినపత్రికలో ప్రచురించడంతోపాటు, పెరిక విద్యార్థి వసతి గృహం కార్యాలయంలో కూడా టెండర్ నోటీసు అతికించబడింది. ఈ మెసేజ్ వెంట కూడా ఆ టెండర్ నోటీసును జతపరుస్తున్నాము. ఆసక్తి కలిగిన కాంట్రాక్టర్ల నుండి టెండర్లను ఆహ్వానిస్తున్నాము. ఈనెల 30లోగా టెండర్లు దాఖలు చేయడానికి గడువు విధించాము. డ్రాయింగ్స్ ను పెరిక విద్యార్థి వసతి గృహం, ఖైరతాబాద్ నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొందవచ్చు. వచ్చే నెలలోనే టెండర్ ఖరారు చేసి, నిర్మాణ పనులు ప్రారంభిస్తామని శుభవార్తను ఈ పండగ పర్వదినాన మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాము.
టెండర్ నోటీస్
సీల్డ్ టెండర్లు కోసం ఆహ్వానం
పెరిక విద్యార్థి వసతి గృహం భవనం నిర్మాణం కోసం టెండర్లు.
స్థలం: L.B నగర్, హైదరాబాద్
ప్రాజెక్టు వివరాలు: స్టిల్ట్ + 4 RCC నిర్మాణం
నిర్మాణ విస్తీర్ణం: సుమారు 8665 చ.అ.
టెండర్ సమర్పణ గడువు: 30 మార్చి 2026 - సమయం: 5:00 PM
వివరాల కోసం, సంప్రదించండి: 98490 41198, 92461 54447
----
మేనేజింగ్ కమిటీ
పెరక విద్యార్థి వసతి గృహం, ఖైరతాబాద్
పెరిక సమాజం ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న బాలికల హాస్టల్ నిర్మాణానికి అతి కీలకమైన శంఖుస్థాపన కార్యక్రమం 2026 ఏప్రిల్ 19న కొత్తపేటలోని సాయి కన్వెన్షన్ లో అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులతో పాటు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన పెరిక పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా ఐదు గంటల పాటు జరిగింది.
ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎల్.పి. ఉపనేత తన్నీరు హరీశ్ రావు, ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. హరీశ్ రావు గారు ఇతర ప్రముఖులు జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు.
పివివిజి అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ సంధాన కర్తగా వ్యవహరించారు.
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు గారు ఈ సభలో మాట్లాడుతూ, మహాత్మాజ్యోతిరావు ఫూలే, సావిత్రిభాయి పూలేను ఆదర్శంగా తీసుకుని పెరిక కులస్తులు బాలికల కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు చేయడం ఆదర్శనీయమన్నారు. కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక కుల ఆత్మగౌరవ భవనానికి బిఆర్ఎస్ ఎంపిల నుంచి నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ కృషి వల్లనే నాడు తమ ప్రభుత్వం కోకాపేటలో పెరిక కులానికి రెండు ఎకరాల స్థలం కేటాయించినట్లు చెప్పారు. పెరిక కులస్తులతో తనకు ఎంతో అనుబంధం ఉందని, అది జీవితాంతం కొనసాగుతుందని చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో పెరిక కులస్తులు ఉభయ సభల్లో విప్ లుగా పనిచేశారని, మీడియా అకాడమీ చైర్మన్, పిఆర్ఓల లాంటి అనేక అవకాశాలు పెరిక కులస్తులకు కల్పించామని చెప్పారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపి ఈటల రాజెందర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సభలో ఈటల మాట్లాడుతూ, పెరిక కులస్తులు తన రాజకీయ జీవితానికి మొదటి నుంచి అండగా ఉన్నారని చెప్పారు. ఖైరతాబాద్ పెరిక హాస్టల్ లో అన్నం తిన్న వాడినని గుర్తు చేసుకున్నారు. పెరిక కులస్తులకు ధైర్యం, పట్టుదల ఎక్కువ అని, అందువల్లనే పెరిక కులం సమాజంలో ఓ ఆదర్శ కులంగా ముందుకు పోతున్నదని ఈటల రాజెందర్ అన్నారు. పెరిక కులస్తులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చనా తాను ముందుండి సాయం అందిస్తానని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, త్వరలోనే చైర్మన్ నియామకం జరుగుతుందని ప్రకటించారు. పెరిక కులస్తులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో మరే కులం కూడా చేయనన్ని గొప్ప కార్యక్రమాలు పెరిక కులం చేయడం అభినందనీయమన్నారు. నాయకత్వ లక్షణాలు కలిగిన పెరిక కులస్తులు ఇతర కులాలను, ప్రజలను కలుపుకుని ముందకు పోతున్నారని చెప్పారు.
ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎల్.బి. నగర్ ప్రాంతంలో పెరిక కులస్తులు ఎక్కువ సంఖ్యలో ఉంటారని, వారికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పెరిక భవన్ నిర్మాణానికి తన వంతుగా ఐదు లక్షల విరాళాన్ని సుధీర్ రెడ్డి గారు ప్రకటించారు.
మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ గారు మాట్లాడుతూ, బాలికల హాస్టల్ నిర్మాణంతో పెరిక జాతి మరో అడుగు ముందుకు వేసిందని చెప్పారు.
రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ పెరిక సంఘం తరుఫున తీర్మానాలు ప్రవేశ పెట్టారు. కుల గణనలో పెరిక కులస్తుల జనాభాను తక్కువగా చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. బిసి కార్పొరేషన్ నిధులను కులాల వారీగా కేటాయించాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ మేయర్ గా ఎన్నికైన పెరిక బిడ్డ, కాంగ్రేస్ పార్టీ నాయకురాలు బెడద ఉమారాణిని, తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నికైన యువజన కాంగ్రెస్ నాయకుడు తూణం శ్రవణ్ ను అతిథులు ఘనంగా సన్మానించారు.
పెరిక సంఘం గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, పివివిజి మాజీ అధ్యక్షులు బొలిశెట్టి వీరయ్య, దాసరి మల్లేశం, శ్రీరాం దయానందర్, అంగిరేకుల నాగార్జున, మాజీ ప్రధాన కార్యదర్శి మైదంశెట్టి లక్ష్మీరాజం, దిడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు దొంగరి వెంకటేశ్వర్లు, బుడగం శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొని కాంగ్రేస్ ప్రభుత్వం పెరిక కులస్తులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అసెంబ్లీ చీఫ్ మార్షల్ తొగరు కరుణాకర్, ప్రముఖ బిల్డర్ మద్దా నర్సయ్య, ఎఎస్పి రవి కుమార్, ఎల్.బి. నగర్ ఎసిపి క్రిష్టయ్య, ఆర్టీవో గోదాసు రవి కుమార్, ప్రొఫెసర్ వడ్డాణం వాసు తదితరులు పాల్గొన్నారు.
కోకాపేట పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ మాట్లాడుతూ పెరిక జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న కోకాపేట భవనానికి విరివిగా విరాళాలు అందించాలని కోరారు. పెరిక పరపతి సంఘం అధ్యక్షులు అందె శ్రీనివాస్, పెరిక సంక్షేమ సమితి అధ్యక్షులు బత్తిని పరమేశ్, కోశాధికారి బోడకుంటి ప్రకాశ్, వివాహ వేదిక నిర్వాహకులు గోపతి కేశవ్, కోకాపేట భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్ చుంచు ఊశన్న, ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాష్ట్ర పెరిక సంఘం అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, మాజీ ప్రధాన కార్యదర్వి భూసాని శ్రీనివాస్, కోశాధికారి సందెల లింగం, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్, ప్రచార కార్యదర్శి బంధు శ్రీధర్ బాబు, అధికార ప్రతినిథి దొంగరి శంకర్, మహిళా విభాగం అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శి మంచాల వరలక్ష్మి, ఎల్.బి. నగర్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎగ్గడి నాగమణి, రంగారెడ్డి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రామినేని లక్ష్మి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గోపతి వెంకటలక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు డాక్టర్ బొలిశెట్టి సతీష్, గౌరవ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, కోశాధికారి గోపతి రాజేశ్, ఎల్.బి.నగర్ శాఖ అధ్యక్షుడు బుద్దె వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు బొలిశెట్టి నర్సింహరావు, అసోసియేట్ అధ్యక్షులు ఎగ్గడి శ్రీనివాస్, దాచెపల్లి రవి, ప్రధాన కార్యదర్శి ముత్తినేని వెంకన్న, రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు బొలిశెట్టి జానకి రాములు, అసోసియేట్ అధ్యక్షుడు బాల్దు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. యువజన విభాగం అధ్యక్షుడు దాసరి జయ ప్రకాష్, గౌరవ అధ్యక్షుడు మైలారిషెట్టి చైతన్య, ప్రధాన కార్యదర్శి జూకురి చైతన్య రాజు పాల్గొన్నారు.
పెరిక సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చింతం రాజేశ్వర్, మల్కాజిగిరి అధ్యక్షులు దిడ్డి రాజు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సూరం రవీందర్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బంధు శ్రీధర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల చంద్రశేఖర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అల్లం రాజేశ్ వర్మ, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు రామినేని రాజేశ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బొడ్డు శంకర్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గజ్వెల్లి సత్యానారాయణ, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాణిక్ ప్రభు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బొడ్డు బుచ్చన్న, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మార్త సత్తయ్య, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరరాఘవులు, కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు మండె వీర హన్మంతరావు, నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు బెడద అనిల్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం కిషన్, కోదాడ హాస్టల్ అధ్యక్షుడు హస్నాబాద్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.