తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
హైదరాబాద్ మహానగరంకి వచ్చి దిక్కుతోచని సందర్భంలో తన అక్కున చేర్చుకొని
అలసట వచ్చిన వారికి ఆసటగా బాసటగా
ఆకలిని తీర్చిన అమ్మగా
వారి అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తుకు బాటలు వేయడంలో ప్రధాన భూమిక పోషించి తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘానికి ఐకానిక్ గా నిలిచిన మహోన్నత దేవాలయం,
చిన్నతనంలో అమ్మ గోరుముద్దలు పెడుతూ చందమామని చూపిస్తూ కడుపునిండా అన్నం పెట్టి ఆనందపడితే,
ఖైరతాబాద్ హాస్టల్ మాత్రం
పెరిక విద్యార్థులకు భవిష్యత్తును చూపిస్తూ కడుపునిండా అన్నం వడ్డించింది ఆనందించింది,
దాని ప్రతిఫలమే చట్టసభల్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గంప గోవర్ధన్ గారు నేడు హాస్టల్ అధ్యక్షులుగా ఉన్న దొంగరి వెంకటేశ్వర్లుగారు,
ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ ఒడిలో సేద తీరిన బిడ్డలు ఎందరో
జడ్జీలు, న్యాయవాదులు, పోలీసులు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు, టీచర్లు ,
అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులకు తన రంగు నద్ది విజయ తిలకం దిద్దింది..
పెరిక సమాజానికి ప్రేమను పంచే అమ్మగా...
అనునిత్యం కొత్త చిగురు తొడిగే కొమ్మగా...
మన ముందు సాక్షాత్కరిస్తుంది,
పెరిక విద్యార్థి వసతి గృహం 51 వ వార్షికోత్సవం సందర్భంగా..
PVVG మేనేజింగ్ అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లుగారు,
ప్రధాన కార్యదర్శి అచ్చ రఘుకుమార్ గారు, ఆర్గనైజింగ్ కార్యదర్శి అంకతి విజయ్ కుమార్ గారు, కోశాధికారి బాల్దురి రవికుమార్ గారు ఆధ్వర్యంలో జరిగింది,
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఘటిక విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ పెరిక కులం యొక్క ఔన్నత్యాన్ని, శక్తిని పెరక కులం యొక్క కార్య దక్షతని , పెరిక కులం యొక్క భవిష్యత్తు కార్యాచరణని బుక్కతిప్పుకోకుండా అనర్గళంగా 30 నిమిషాల పాటు ప్రస్తావించడం ప్రశంసనీయం, బత్తిని పరమేష్ గారు, గుండు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ఖైరతాబాద్ హాస్టల్లో పూర్వ విద్యార్థులుగా ఉంటూ చదువుకోబట్టే విజయాలను చేరుకోగలిగము అని,హాస్టల్ లేకపోతే తమ జీవితం లేదని ప్రస్తావించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అతిరథ మహారధులు పాల్గొని ప్రస్తావించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య గారు, డైనమిక్ లీడర్ దాసరి మల్లేశం గారు, శ్రీరామ్ దయానంద్ గారు, సుంకరి ఆనంద్ గారు, దొంగరి మనోహర్ గారు, ధనియాకుల కృష్ణ గారు, పాయిల్ జంగయ్య గారు, కోకాపెట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీర భాస్కర్ గారు, వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు, బొలిశెట్టి సతీష్ గారు, దొంగరి శంకర్ గారు, దిడ్డి సురేష్ గారు, మైలారిశెట్టి చైతన్య గారు, గ్రేటర్ హైదరాబాద్ టీం, ఎల్బీనగర్ టీం, రంగారెడ్డి టీం, ధర్మకర్తలు, విద్యార్థులు, తదితరులు పాల్గొనడం జరిగింది..