తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతి గృహంలో సుదీర్ఘకాలం సేవలు అందించి, ఇటీవల అనారోగ్యానికి గురైన అచ్చంపేటకు చెందిన పోకల శంకరయ్యకు పెరిక విద్యార్థి వసతి గృహం, రాష్ట్ర పెరిక సంఘం అండగా నిలిచాయి.
పెరిక విద్యార్థి వసతి గృహం తరుఫున లక్ష రూపాయల సహాయాన్ని అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, కోశాధికారి బాల్దురి రవికుమార్ అందించారు.
రాష్ట్ర పెరిక సంఘం తరుఫున రాష్ట్ర సంఘం అద్యక్షుడు డాక్టర్ గటిక విజయ్ కుమార్ 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
2026 జనవరి 3న అచ్చంపేటలో జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ సహాయాన్ని నాయకులు అందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ సుందరి వీర భాస్కర్, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనందర్, ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, పెరిక కుల సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి వలిశెట్టి లక్ష్మిశేఖర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెరిక సంఘం గౌరవ సలహాదారులు పోకల మనోహర్, ప్రముఖ విద్యావేత్త సాదె రాజు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జనవరి 8 - 2026 : పెరిక కుల పెద్దలు ఎంతో ముందు చూపుతో భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలనే మంచి లక్ష్యంతో ఖైరతాబాద్ లో 50 ఏళ్ల క్రితం పెరిక విద్యార్థి వసతి గృహం స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు పని చేసిన అన్ని కార్యవర్గాలు తమ విధులను చిత్తశుద్దితో నిర్వహించి, రాష్ట్రంలో మరే కుల సంఘమూ నిర్వహించలేని విధంగా మనం హాస్టల్ ను గొప్పగా నడుపుతున్నామనే విషయాన్ని సగర్వంగా ప్రకటిస్తున్నాము. మనం ఎల్.బి. నగర్ ప్రాంతంలో బాలికల కోసం హాస్టల్ నిర్మాణం కూడా చేసుకుంటున్నాము. కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక కుల ఆత్మగౌరవ భవనంలో కూడా మరో హాస్టల్ ఏర్పాటు చేయాలని మన కుల పెద్దలు నిర్ణయించారు.
ఈ సందర్భంలో విద్యార్థి వసతి గృహం నిర్వహణ మరింత పారదర్శకంగా, ప్రజాస్వామిక యుతంగా, జవాబుదారీతనంతో ఉండేందుకు వీలుగా సంస్కరణలు చేపట్టాలని కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పెరిక విద్యార్థి వసతి గృహంలో ఫిర్యాదులు, సూచనల బాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఏళ్ల తరబడి కుల సేవకు అంకితమైన మాజీ, ప్రస్తుత అధ్యక్షులతో క్రమశిక్షణ కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది.
హాస్టల్ నిర్వహణకు సంబంధించిన ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేయడంతో పాటు, బాధ్యులపై చర్యలకు సిఫారసు చేసే అధికారం ఈ క్రమశిక్షణ కమిటీకి ఉంటుంది. హాస్టల్ విద్యార్థులపై గానీ, ధర్మకర్తలపై గానీ, కార్యనిర్వాహక కమిటీ బాధ్యులపై గానీ ఏమైనా ఫిర్యాదులు వస్తే క్రమశిక్షణ సంఘం సమావేశమై చర్చిస్తుంది. వాస్తవాల ఆధారంగా తగు చర్యలు తీసుకుంటుంది.
పెరిక విద్యార్థి వసతి గృహ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ జరిగేలా చూడడం, ఈ విషయంలో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే చర్యలకు సిఫారసు చేయడం ఈ కమిటీ బాధ్యత. హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించడంతో పాటు, ధర్మకర్తల హక్కులు కాపాడడం, అన్నింటికి మించి పెరిక విద్యార్థి వసతి గృహం ప్రతిష్టను కాపాడడం ఈ కమిటీ బాధ్యతగా ఉంటుంది.
పెరిక విద్యార్థి వసతి గృహం నిర్వహణపై ఎవరైనా సభ్యులు తమకున్న అభ్యంతరాలు, అనుమానాలు, ఆరోపణలు ఈ కమిటీకి వివరించే అవకాశం ఉంటుంది. వాటిని కమిటీ కూలంకశంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఎవరైనా సరే, తాము చేసిన ఆరోపణలకు, విమర్శలకు సరైన ఆధారాలు చూపిస్తే ఈ కమిటీ విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటుంది. అదే సందర్భంలో పెరిక విద్యార్థి వసతి గృహం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎవరైనా సరే బహిరంగంగా, సోషల్ మీడియా ద్వారా నిరాధార ఆరోపణలు చేస్తే వారిపై తగిన చర్యలు తీసుకునే విషయంలో కూడా ఈ కమిటీ సిఫారసులు చేస్తుంది.
పెరిక విద్యార్థి వసతి గృహం శాఖోపశాఖలుగా విస్తరించి, వేలాది మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలని, హాస్టల్ పది కాలాల పాటు పదిలంగా ఉండాలనే మంచి లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ సంస్కరణలను ధర్మకర్తలంతా స్వాగతిస్తారని ఆశిస్తున్నాము.
క్రమశిక్షణ కమిటీ
కన్వీనర్ : డాక్టర్ శ్రీ దొంగరి వెంకటేశ్వర్లు గారు, పివివిజి అధ్యక్షులు
మెంబర్ సెక్రటరీ : శ్రీ అచ్చా రఘు కుమార్ గారు, పివివిజి ప్రధాన కార్యదర్శి
సభ్యులు :
1. శ్రీ ఎడమ నర్సింగ్ రావు గారు, స్థాపక ధర్యకర్త మరియు పివివిజి మాజీ అధ్యక్షులు
2. శ్రీ బొలిశెట్టి వీరయ్య గారు, పివివిజి మాజీ అధ్యక్షులు
3. శ్రీ పాయిల జంగయ్య గారు, పివివిజి మాజీ అధ్యక్షులు మరియు రాష్ట్ర పెరిక సంఘం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి
4. శ్రీ దాసరి మల్లేశం గారు, పివివిజి మరియు రాష్ట్ర పెరిక సంఘం మాజీ అధ్యక్షులు
5. శ్రీ శ్రీరాం దయానంద్ గారు, పివివిజి మరియు రాష్ట్ర పెరిక సంఘం మాజీ అధ్యక్షులు
6. శ్రీ అంగిరేకుల నాగార్జున గారు, పివివిజి మాజీ అధ్యక్షులు
7. శ్రీ శ్రీరాం భద్రయ్య గారు, రాష్ట్ర పెరిక సంఘం మాజీ అధ్యక్షులు
8. శ్రీ మద్దా లింగయ్య గారు, రాష్ట్ర పెరిక సంఘం మాజీ అధ్యక్షులు
9. డాక్టర్ శ్రీ గటిక విజయ్ కుమార్ గారు, రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు
10. శ్రీ సుందరి వీరభాస్కర్ గారు, పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్
11. శ్రీ అందె శ్రీనివాస్ గారు, పెరిక పరపతి సంఘం అధ్యక్షులు
12. శ్రీ బత్తిని పరమేశ్ గారు, పెరిక సంక్షేమ సమితి అధ్యక్షులు
ఇట్లు
అధ్యక్షులు మరియు కార్యవర్గం
పెరిక విద్యార్థి వసతి గృహం
క్రమ శిక్షణ కమిటీ సమావేశం
పెరిక విద్యార్థి వసతి గృహం క్రమశిక్షణ కమిటీ సమావేశం 2026 జనవరి 20న ఖైరతాబాద్ హాస్టల్లో జరిగింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మెంబర్ సెక్రటరీ అచ్చా రఘు కుమార్, సభ్యులు బొలిశెట్టి వీరయ్య, పాయల జంగయ్య, దాసరి మల్లేశం, శ్రీరామ్ దయానంద్, మద్ద లింగయ్య, గటిక విజయ్ కుమార్, సుందరి వీరభాస్కర్, బత్హిని పరమేష్, అందే శ్రీనివాస్ పాల్గొన్నారు.
పెరిక విద్యార్థి వసతి గృహం ప్రతిష్టను, గౌరవాన్ని కాపాడే విషయంలో చేపట్టాల్సిన చర్యలను ఈ సందర్భంగా కమిటీ కూలంకషంగా చర్చించింది. హాస్టల్ నిర్వహణకు సంబంధించి వచ్చిన ఆరోపణలు, విమర్శలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా కమిటీ నిర్ణయించింది.
పెరిక విద్యార్థి వసతి గృహంలో నాలుగు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇటీవలే ధర్మకర్త బొలిశెట్టి రంగారావు గారు చేసిన ఆరోపణలపై కమిటీ చర్చించింది.
చేసిన ఆరోపణలను నిరూపించాలని, తగిన ఆధారాలు చూపాలని ఇప్పటికే బొలిశెట్టి రంగారావు గారికి హాస్టల్ మేనేజింగ్ కమిటీ ఒక నోటీసు పంపింది. జనవరి 15వ తేదీలోగా సమాధానం చెప్పాలని కోరింది. అయినప్పటికీ రంగారావు గారు నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో రంగారావు గారికి మరొక అవకాశం ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 5న రంగారావు గారు చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని కమిటీ నిర్ణయించింది. ఈ విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావాలని బొలిశెట్టి రంగారావు గారిని కమిటీ కోరింది. రంగారావు గారు చేసిన ఆరోపణల సందర్భంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉండడంతోపాటు ఆరోపణలను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చిన మరో ఇద్దరు ధర్మకర్తలు ఎర్రం శెట్టి ముత్తయ్య గారు, అంకతి ఉమామహేశ్వరరావు గారలకు కూడా నోటీసులు పంపాలని కమిటీ నిర్ణయించింది. ఈ ముగ్గురికి నోటీసులు పంపి ఫిబ్రవరి 5న మధ్యాహ్నం మూడు గంటలకు పెరిక విద్యార్థి వసతి గృహంలో జరిగే విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావాలని నిర్ణయించింది. రంగారావు గారు చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు, సాక్ష్యాలు చూపినట్లయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఒకవేళ ఆధారాలు చూపనట్లయితే నిరాధార ఆరోపణలు చేసి, హాస్టల్ ప్రతిష్టలు దిగజార్చినందుకు రంగారావు గారిపై చర్యలు తీసుకోవాలని కూడా కమిటీ నిర్ణయించింది.