తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
కో ఆర్డినేటర్
కో ఆర్డినేటర్
కో ఆర్డినేటర్
2026 జనవరి 30న జరిగే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పెరిక బిడ్డ శ్రీమతి ముత్తె అంజలీదేవి నిలబడ్డారు. అంజలీదేవి హైకోర్టులో ప్రముఖ న్యాయవాది. గతంలో హైకోర్టులో ఎజిపిగా కూడా పనిచేశారు. ఇటీవల జరిగిన హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటితీ ఇసి మెంబర్ గా గెలిచారు. ప్రస్తుతం బార్ కౌన్సిల్ సభ్యురాలిగా పోటీ పడుతున్నారు. అంజలికి రాష్ట్ర పెరిక సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆమెను గెలిపించే బాధ్యతను పెరిక కులస్తులు తీసుకోవాలని రాష్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పెరిక కులానికి చెందిన అడ్వకేట్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేయడంతో పాటు, ఇతర న్యాయ వాదులతో కూడా ఓట్లు వేయించాలని కోరారు. సీరియల్ నెంబర్ 10తో అంజలీదేవి పోటీ చేస్తున్నారని, ఆమెను గెలిపించాలని కోరారు. పోటీలో ఉన్న అంజలీదేవి, ఆమె భర్త ప్రముఖ న్యాయవాది తిరుపతి వర్మ 2026 జనవరి 13న హైదరాబాద్ లో రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ ను కలిశారు. శాలువాతో సన్మానించారు. పెరిక సంఘం మద్దతు కోరారు. అంజలీదేవికి యావత్ పెరిక సమాజం అండగా ఉండి, గెలిపించే బాధ్యత తీసుకుంటుందని విజయ్ కుమార్ హామీ ఇచ్చారు.
తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది అంజలీదేవి ముత్తె గారికి తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అంజలీదేవి గారిని గెలిపించుకుందామని పిలుపు ఇచ్చిన రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్.
ఈనెల 30 వ తేదీన జరుగుతున్న తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కుల బంధువు హైకోర్టు న్యాయవాది ముత్తే అంజలి గారు, తన భర్త న్యాయవాది తిరుపతి వర్మ గారితో కలిసి ఈరోజు ఖైరతాబాద్ లోని పెరిక హాస్టల్ లో పెరిక కుల సంఘం పెద్దలని ఎన్నికలల్లో తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.
రాష్ట్రవ్యాప్తంగా 250 మంది పెరిక కుల అడ్వకేట్లు బార్ కౌన్సిల్ మెంబర్స్ గా ఉన్నారని, కుల సంఘం తరఫున ఎన్నికలో వారు తనకు ఓటు వేయాలని పిలుపు ఇవ్వాలని కోరారు.
గౌరవాధ్యక్షుడు మద్ద లింగయ్య గారు మాట్లాడుతూ పెరిక కుల బార్ కౌన్సిల్ మెంబర్స్ అంజలి దేవి గెలుపుకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర సంఘం అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్ గారు, బొలిశెట్టి వీరయ్య గారు, దాసరి మల్లేశం గారు,పాయిల జంగయ్య గారు, విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు గారు, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు సుందరి వీరభాస్కర్ గారు, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ గారు, సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి వలిశెట్టి లక్ష్మీ శేఖర్ గారు, సంక్షేమ సమితి అధ్యక్షులు బత్తిని పరమేష్ గారు, రాష్ట్ర సంఘం ఆర్థిక కార్యదర్శి సందెల లింగం గారు, వసతి గృహం ప్రధాన కార్యదర్శి అచ్చ రఘు కుమార్ గారు, ఆర్థిక కార్యదర్శి బాల్దూరి రవికుమార్ గారు, కార్యనిర్వాక కార్యదర్శి, అంకతి విజయ్ కుమార్ గారు, పవన్ నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, యువజన విభాగపు గౌరవాధ్యక్షులు మైలారిశెట్టి చైతన్య గారు, ఎల్బీనగర్ జోన్ గౌరవ అధ్యక్షుడు బొలిశెట్టి నరసింహరావు గారు, ఎల్బీనగర్ జోన్ అధ్యక్షుడు బుద్దె వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శి ముత్తినేని వెంకటేశ్వర్లు గారు, లాయర్ విభాగపు కోఆర్డినేటర్ జూకూరి మహేష్ గార్లు పాల్గొన్నారు.