తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షులు
గౌరవ అధ్యక్షులు
ప్రధాన కార్యదర్శి
కార్యనిర్వాహక కార్యదర్శి
కోశాధికారి
రాష్ట్రంలో మరే కులము చేయని విధంగా తెలంగాణలో పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో 10 ప్రత్యేక కార్యక్రమాలు అమలు అవుతున్నాయని రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ అన్నారు. పెరిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు తోటి కులస్తులకు ఎంతో ఉపయోగపడడంతో పాటు మిగతా కులాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. వరంగల్ లోని ఎంకే కన్వెన్షన్ లో 2025 డిసెంబర్ 7న జరిగిన వరంగల్ జిల్లా పెరిక సంఘం సర్వసభ్య సమావేశంలో విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పెరిక కుల సంఘం అధికారిక వెబ్ సైట్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో విజయ్ కుమార్ మాట్లాడుతూ కుల సంఘాల అంతిమ లక్ష్యం సామాజిక మార్పు, పేదరిక నిర్మూలన అయి ఉండాలని సూచించారు. కుల సంఘం కోసం పనిచేయడం అంటే ఎవరి ఇంటిని వారు చక్కదిద్దుకోవడమే అని చెప్పారు. ప్రతి కులంలోని పెద్దలు ఆ కులాభివృద్ధికి కృషి చేస్తే అంతిమంగా సమాజంలోని అన్ని సామాజిక వర్గాలు పురోగమిస్తాయని అభివర్ణించారు.
పెరిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 10 ప్రత్యేక కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
కోకాపేటలో రెండు ఎకరాల స్థలంలో తెలంగాణ పెరికకుల ఆత్మగౌరవ భవనం నిర్మాణం అవుతున్నదని, రాష్ట్రంలో మరే కుల సంఘం కూడా ఇప్పటివరకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భవనం నిర్మించుకోలేదని, ఆ ఘనత పిరకకుల సంఘానికి దక్కుతున్నదని చెప్పారు. ఎల్బీనగర్ ప్రాంతంలో బాలికల కోసం ప్రత్యేక వసతిగృహం నిర్మిస్తున్నామని, పెరికకుల పరపతి సంఘం ఆధ్వర్యంలో నాలుగు కోట్ల రూపాయల టర్నోవర్తో ఆర్థిక సహాయ కార్యక్రమాలు అందిస్తున్నామని, పెరిక సంక్షేమ సమితి ద్వారా కోటి రూపాయల నిధితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 35 అనుబంధ సంఘాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి పెరిక బిడ్డ ఆలనా పాలనా చూసే ప్రక్రియ ప్రారంభం అయిందని, పెరిక కుల కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఒక వెబ్సైట్ నిర్వహిస్తున్నామని, పెరిక కులం తరఫున ఒక పేపర్, ఒక న్యూస్ ఛానల్ కూడా నడుపుతున్నామని, పెరిక కుల వివాహ వేదిక తరపున ఇప్పటికీ 28 శిబిరాల నిర్వహించి 6000 ఉచిత పెళ్లిళ్లు నిర్వహించినట్లు విజయ్ కుమార్ వివరించారు. రాష్ట్రంలోని ప్రతి పెరిక కులస్తుడి వివరాలు తెలుసుకునేందుకు అన్ని జిల్లాల్లో సమగ్ర పెరిక కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు వివరించారు. పెరిక కుల సంఘం తరఫున రాష్ట్రంలోని పెరిక కులస్తులందరికీ ఉచిత న్యాయ సహాయం, ఉచిత వైద్య సహాయం అందించే కార్యక్రమం కొనసాగుతున్నదని, అదేవిధంగా త్వరలోనే పెరిక కులస్తులందరికీ ఉచిత విద్య అందించే విధంగా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.
రాష్ట్రంలో మరే కుల సంఘం కూడా ఇన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించడం లేదని, మిగతా కులాలకు తెలంగాణలో పెరిక కులం ఆదర్శంగా నిలుస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లా పెరికకుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్టు అల్లం రాజేష్ వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సమావేశంలో పెరిక కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మద్దాలింగయ్య , మాజీ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్ , పెరిక హాస్టల్ అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, పరపతి సంఘం అధ్యక్షులు అందే శ్రీనివాస్, నాయకులు చుంచు ఉషన్న, సుంకరి ఆనంద్, దొంగరి మనోహర్, సందెల లింగం, కుంచాల శ్రీనివాస్, అంకతి విజయ్ కుమార్ , బల్దూరి రవికుమార్, మైళారు శెట్టి చైతన్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాన్ల చంద్రశేఖర్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ సత్యనారాయణ, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సూరం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన పెరిక సంఘం నాయకులు 2025 డిసెంబర్ 5న హన్మకొండలో రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారిని కలిశారు. పెరిక సంఘం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలపై చర్చించారు. 2025 డిసెంబర్ 7న వరంగల్ ఎంకె నాయుడు కన్వెన్షన్ లో జరిగే జిల్లా పెరిక సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. పెరిక కుల సంఘం అధికారిక వెబ్ సైట్ ప్రారంభించాలని కోరారు. దీనికి మంత్రి సురేఖ గారు సమ్మతించారు. తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయకుమార్ , పెరిక ధాత్రి ఎడిటర్ బరుపటి సంపత్ కుమార్, పెరిక కుల నాయకులు అల్లం రాజేష్ వర్మ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెరకకుల పెద్దలు వనపర్తి శ్రీనివాస్ , పెరిక కుల వరంగల్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు బెడద వీరన్న, ఎసిరెడ్డి ప్రభాకర్ , అంకతి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన తూనం శ్రవణ్ కుమార్ ను, తొర్రూరు మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్ ను, కౌన్సిలర్ ముద్దసాని సురేష్ కుమార్ ను పెరిక కుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు అల్లం రాజేష్ వర్మ ఆధ్వర్యంలో శుక్రవారం పెరిక సంఘం నాయకులు అభినందనలు తెల్పి, ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ గా కమిషనర్ గా కౌన్సిలర్ గా ముగ్గురు పెరిక బిడ్డలు తొర్రూరు మున్సిపాలిటీకి ముఖ్యమైన బాధ్యతల్లో సేవలందిస్తుండడం పెరిక కులానికి గర్వకారణమని పెరిక సంఘం నాయకులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పెరిక కుల సంఘం వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బరుపటి గోపి, ముఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి బెడద వీరన్న, ప్రధాన కార్యదర్శి ఎంబాడి అమరేందర్, పెరికధాత్రి మాసపత్రిక ఎడిటర్ బరుపటి సంపత్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ మంచాల రాజు, అంకతి అభిలాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించిన వరంగల్- హన్మకొండ కుల సోదరులందరికీ అభినందనలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్.
వరంగల్ జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షుడు అల్లం రాజేష్ వర్మ, గౌరవ అధ్యక్షుడు బరుపటి గోపి, హనుమకొండ జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షులు రామినేని రాజేష్, గౌరవాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీనివాస్ గార్లు, వారి కార్యవర్గాల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయ్ కూమర్ గారి సూచనలతో 2026 ఏప్రిల్ 29న నిర్వహించిన భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అధ్యంతం అద్భుతంగా, అట్టహాసంగా, అత్యంత విజయవంతంగా జరిగాయి.
న భూతో న భవిష్యత్ అనే రితీగా గొప్ప భావనతో సాగిన ఈ మహోత్సవం పెరిక కుల ఐక్యతను మరింత బలపరుస్తూ, ప్రతి కులబంధువు హృదయంలో గర్వాన్ని నింపిన ఈ చారిత్రాత్మక వేడుక పెరిక కుల కీర్తిని మరింత ఎత్తుకు చేర్చింది.
ఈ కార్యక్రమం వరంగల్, హనుమకొండ రెండు కుల సంఘ కమిటీలు సంయుక్తంగా, అద్భుతమైన సమన్వయంతో పనిచేసి ప్రతి ఏర్పాటును శ్రద్ధగా, శ్రమతో, నిబద్ధతతో నిర్వహించడం విశేషం. వారి ఐక్యత, కులం మీద ప్రేమ ఈ మహోత్సవాన్ని మరింత విజయవంతం అయ్యేలా చేసింది.
రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో,గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య గారు, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ గారు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్ గారు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ గారు, విద్యార్థి వసతి గృహం ప్రధాన కార్యదర్శి అచ్చా రఘు కుమార్ గారు, కోశాధికారి బాల్దూరి రవికుమార్ గారు, నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్ గారు, గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు గారు, పొలిటికల్ సెల్ కోఆర్డినేటర్ చింతం సదానందం గారు, న్యాయ విభాగపు కోఆర్డినేటర్లు అల్లం నాగరాజు గారు, జూకూరి మహేష్ గారు,ఎల్బీనగర్ జోన్ కార్యనిర్వాక కార్యదర్శి యర్రంశెట్టి రవీందర్ గారు, కరీంనగర్ పెరిక కుల సంఘం అధ్యక్షుడు గాండ్ల చంద్రశేఖర్ గారు, పెద్దపల్లి జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షులు దుడ్డే మల్లేశం గారు, కుల బంధువు కందుల పోచయ్య గారు,తొర్రుర్ పట్టణ కౌన్సిలర్ ముద్దసాని సురేష్ గారు అతిథులుగా హాజరయ్యారు.
రాష్ట్ర నాయకులు భద్రకాళి అమ్మవారి సన్నిధికి రాగానే వరంగల్–హనుమకొండ కుల సంఘ సభ్యులు సాంప్రదాయబద్ధంగా, ఆత్మీయంగా ఆహ్వానించి, కండువాలు కప్పి, వేద మంత్రోచ్ఛారణల మధ్యన ఆలయంలోకి తీసుకువెళ్లడం ఆధ్యాత్మికంగా అందరిని అలరించింది.
అమ్మవారి దర్శనం, తదితర కార్యక్రమాలు సంబ్రమాశ్చర్యాలు కలిగేలా అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.
“జై భద్రకాళి… జై జై భద్రకాళి… జై పెరిక… జై జై పెరిక…” అనే నినాదాలతో గుడి పరిసరాలు మార్మోగి, ప్రతీ పెరికీయుడి గుండెల్లో గర్వం ఉప్పొంగేలా ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసేలా చేసిన వరంగల్ - హనుమకొండ కుల సోదరులు ధన్యులు.
అధిక సంఖ్యలో మహిళలు కూడా పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ నిర్వహించడం ఈ కార్యక్రమానికి మరింత పుణ్యతను చేకూర్చింది.
అమ్మవారి సాన్నిధ్యంలోనే ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్య అతిథులను ఆహ్వానించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం,
భద్రకాళి అమ్మవారి చిత్రపటాలను బహుకరించి కుల నాయకులను సత్కరించి గౌరవించిన తీరు నిజంగా అమోఘం.
అనంతరం డాక్టర్ మోటపల్కుల శ్రీనివాస్ వర్మ - కృష్ణవేణి దంపతుల సహకారంతో ఏర్పాటు చేసిన రుచికరమైన భోజనాలు ఆరగించి, అన్నదాత సుఖీభవ అని వారిని కుల సోదరులు దీవించారు.
ఉదయం 11 గంటలకు మొదలైన కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగి అన్ని కార్యక్రమాల అనంతరం సంతోషభరిత వాతావరణంలో కార్యక్రమాన్ని ముగించిన తీరును అందరూ కొనియాడారు.
ప్రత్యేకంగా ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన వరంగల్ జిల్లా అధ్యక్షుడు అల్లం రాజేష్ కుమార్, గౌరవాధ్యక్షుడు బరుపటి గోపి,హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రామినేని రాజేష్, గౌరవాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీనివాస్, వరంగల్ జిల్లా ముఖ్య కార్య నిర్వాహక కార్యదర్శి బెడద వీరన్న, వరంగల్, హనుమకొండ ప్రధాన కార్యదర్శులు ఎంబాడి అమరేందర్, నల్లపు కోటేశ్వర్, కోశాధికార్లు బుద్ధ గణేష్ వనపర్తి ధర్మరాజు, నాయకులు శ్రీధర్ల ఈశ్వర్ కుమార్ అచ్చ జగదీశ్వర్, వైస్ ప్రెసిడెంట్ చిట్టి బొమ్మల భిక్షపతి, తీర్థాల పురుషోత్తం, దొమ్మటి భాస్కర్, బిల్లా సుదర్శన్, అరుసం రాంబాబు, బిల్ల రాంబాబు, అంకతి అభిలాష్,చింతం రాజకుమార్, ఏసిరెడ్డి ప్రభాకర్, ముడిదే రఘునాథ్ అరసం సంతోష్, గుమ్మల్ల కిరణ్ కుమార్, అంకతి రాకేష్, తొర్రూర్ కౌన్సిలర్ ముద్దసాని సురేష్, తదితరులు పాల్గొని అత్యంత విజయవంతం చేసిన తీరును,కార్యవర్గ సభ్యులు చూపించిన సేవా తపన, అంకితభావం, నాయకత్వం కులానికి ఆదర్శంగా నిలిచాయి,
వారందరికీ రాష్ట్ర సంఘం తరుపున అధ్యక్షులు ఘటిక విజయ్ కుమార్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు🙏
అమ్మవారి దివ్య ఆశీస్సులతో
మన పెరిక సమాజం మరింత ఐక్యంగా, మరింత శక్తివంతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ…
జై భద్రకాళి అమ్మవారు 🔱
జై పెరిక కుల సమాజం ✊