తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
పెరిక కులస్తులకు ఓ సంఘం ఉండాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిక కులస్తులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని, వారందరి సంక్షేమం కోసం పాటు పడాలనే లక్ష్యంతో 1970 దశకంలో చాలా మంది పెరిక పెద్దలు ఎంతో శ్రమించారు. వారందరినీ మన జాతి మరిచిపోకుండా గుర్తుంచుకోవాలనే లక్ష్యంతో పెరిక యుగకర్తలను పరిచయం చేయాలని రాష్ట్ర సంఘం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా పెరిక సంఘం అధ్యక్షులు గజవెల్లి సత్యనారాయణ గారు పెరిక యుగకర్తల గురించిన వివరాలను అందించారు.
జాతీయ నాయకుడుగా ఎదిగిన ఏకైక పెరిక బిడ్డ
లోకసభ మాజీ డిప్యూటీ స్పీకర్
రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్
నెహ్రూతో కలిసి స్వతంత్ర్య ఉద్యమం
లోహియాతో కలిసి సోషలిస్టు ఉద్యమం
ఇందిరాగాంధితో కలిసి ప్రభుత్వ నిర్వహణ
పార్లమెంటు నుంచి సస్పెండైన తొలి ఎంపి
క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకెళ్లిన చరిత్ర
గోడె మురహరి గారు సోషలిస్టు. పార్లమెంటేరియన్. స్వతంత్ర్య సమరయోధుడు. యావత్ పెరిక జాతి గర్వించదగిన గొప్ప నాయకుడు. సోషలిస్టు భావజాలం కలిగిన మురహరి బహుముఖ పాత్రలు నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్ లో క్రియాశీల సభ్యుడిగానే కాకుండా, ఏఐసిసి సభ్యుడిగా కూడా పనిచేశారు. జవహర్ లాల్ నెహ్రూ గారితో కలిసి స్వతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. 1948లో సోషలిస్టు వర్గం కాంగ్రెస్ నుండి వేరుపడే వరకు కాంగ్రేసులోని సోషలిష్టు వర్గానికి చెందినవాడు.
1943లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను జైలులో పెట్టింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే నేరాభియోగంతో బనారస్ జిల్లా నుండి రెండేళ్లు బహిష్కరించబడ్డాడు. 1946లో జవాహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడేవరకు ఈ బహిష్కరణ కొనసాగింది. స్వతంత్ర భారతంలో కూడా ఈయన సోషలిష్టు పార్టీ కార్యకలాపాలలో పాల్గొని మూడు సార్లు జైలు శిక్ష అనుభవించాడు. సోషలిస్టు భావజాలంతో ప్రభావితుడై, రామ్ మనోహర్ లోహియా ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. 1957 నుండి 1958 వరకు అఖిల భారత సమాజ్వాదీ యువక్ సభకు కార్యదర్శిగా, 1957 నుండి 1958 వరకు అఖిలభారత సోషలిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, 1961 నుండి 1963 వరకు సోషలిస్టు పార్టీ కేంద్ర పార్లమెంటు బోర్డుకు కార్యదర్శిగా పనిచేశారు.
1962 లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. నాటి నుంచి 1977 వరకు 13 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యడిగా కొనసాగారు. రాజ్యసభలో ఎక్కువగా ప్రజా సమస్యలు ప్రస్తావించేవారు. ప్రాంతీయ అభివృద్ధి గురించి పరిశోధనాత్మక ఉపన్యాసాలు చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి, రాజ్యసభను స్తంభింప చేయడానికి ప్రయత్నించడంతో సస్పెండ్ కూడా అయ్యారు. స్వతంత్ర్య భారతదేశంలో రాజ్యసభ నుంచి సస్సెండైన తొలి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు.
నాటి ప్రధాని ఇందిరాగాంధి ప్రత్యేకమైన చొరవతో మురహరి గారిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చేశారు. నాడు రాజ్యసభ చైర్మన్ గా ఉప రాష్ట్రపతి బిడి జెట్టి ఉండేవారు. 1972 నుంచి 1977వరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు. 1977లో విజయవాడ లోకసభ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అదే టర్మ్ లో లోకసభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. నాడు స్పీకర్ గా నీలం సంజీవరెడ్డి, ప్రధానమంత్రిగా ఇందిరాగాంధి ఉండేవారు.
గోడె మురహరి గారు 1926 మే 20న ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో జన్మించారు. ఆయన తండ్రి గోడె గంగరాజు గారు. 982 ఆగస్టు 5న న్యూఢిల్లీలో మురహరి గారు మరణించారు.
తులాబందుల నాగేశ్వరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రజా నేత, ప్రజాసేవను జీవిత ధ్యేయంగా స్వీకరించిన విశిష్ట నాయకుడు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామంలో జన్మించినారు.
1967 లో అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శాసనసభలో ప్రజల సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావించి, ప్రజాప్రతినిధిగా విశిష్ట గుర్తింపు పొందారు. రాష్ట్ర శాసనసభలొ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా ప్రభుత్వ ఖర్చుల పరిశీలన లొ కీలక పాత్ర పోషించారు.అధికార భాష సంఘ సభ్యుడిగా తెలుగు భాష అభివృద్ధికి కృషి చేశారు. వెనకబడిన వర్గాల సంక్షేమ కోసం ఏర్పాటు అయిన కమిషన్ లో సేవలందించారు. దేశ రక్షణ తదితర ముఖ్యాంశాలపై ఆకాశవాణి ద్వారా ప్రజలకు అవగాహన కనిపించే ప్రసంగాలు చేశారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు అధ్యక్షులుగా ఉన్న ఆల్ ఇండియా పంచాయతీ రాజ్ స్టడీ టీమ్ లో సభ్యులుగా పాల్గొన్నారు. వెనకబడిన వర్గాల సంక్షేమ పరిశీలనార్థం ఏర్పాటు చేసిన కాలేల్కర్ కమిషన్ కార్యక్రమాలను అనుబంధంగా సేవలందించారు. మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయమునకు ధర్మకర్తగా ఆలయ అభివృద్ధికి కృషి చేసినారు. సమాజ సేవలొ విశేష కృషి చేసినందుకు సంఘమిత్ర అనే బిరుదు అందుకున్నారు. తులాబత్తుల నాగేశ్వరావు గారు రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా సామాజిక చైతన్యవేత్త, పరిపాలన నిపుణుడు ఆధ్యాత్మిక సేవకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందినారు.
ఎంపిపి నుంచి ఎంపి వరకు 24 సంవత్సరాల పాటు ఏకధాటిగా వివిధ పదవులు నిర్వహించిన బోడకుంటి వెంకటేశ్వర్లు గారిది విశిష్ట రాజకీయ ప్రస్థానం. మాజీ ముఖ్యమంత్రులు ఎన్.టి. రామారావు, నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గార్లతో కలిసి పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.
వెంకటేశ్వర్లు గారు11.05.1956 న శ్రీమతి లక్ష్మమ్మ- సిద్దయ్య దంపతులకు జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామంలో ఏకైక సంతానంగా జన్మించారు. వారిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. చిన్ననాటి నుంచి క్రమశిక్షణ కృషి సేవా భావం అలవర్చుకున్నారు.
ప్రాథమిక విద్యను స్వగ్రామమైన బచ్చన్నపేటలో, ఇంటర్మీడియట్ జనగామలో పూర్తిచేసి అనంతరం ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ(ఎంపీసీ) అగ్రికల్చర్ పట్టా పొందారు.
రాజకీయ ప్రస్థానం గ్రామ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రజాసేవకు శ్రీకారం చుట్టినారు.
1978లో జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ గా నియమితులయ్యారు.
1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు వారు ఆ పార్టీలో చేరారు.
1987లో మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత, మొదటిసారి జరిగిన ఎన్నికల్లో బచ్చన్నపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1995 జెడ్పిటిసి ఎన్నికల్లో సంగెం మండలం నుంచి జడ్పీటిసిగా విజయం సాధించి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు.
1999లో వరంగల్ లోసభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2009లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
2015 లో కూడా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
2019లో శాసనమండలిలో చీప్ విప్ గా నియమితులైనారు.
గౌరవ శ్రీ బోడ కుంటి వెంకటేశ్వర్లు గారు సుమారు 40 సంవత్సరాల రాజకీయ జీవితం అంతట నీతి, నిజాయితీ, పారదర్శకత ల కు ప్రాధాన్యమిస్తూ ప్రజాసేవే ముఖ్యంగా పని చేశారు.
తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీల పాత్ర పోషించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ రాష్ట్రంలో పెరిక సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎంపిగా, ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తన నియోజకవర్గ అభివృద్ది నిధులను పెరిక భవన్ల నిర్మాణానికి ఉపయోగించి కులానికి సేవలు అందించారు.
శాసనసభకు ఐదుసార్లు ఎన్నికై, అసెంబ్లీలో రెండు పర్యాయాలు ప్రభుత్వ విప్ గా పని చేసిన ఏకైక పెరిక బిడ్డ గంప గోవర్థన్ గారు.
మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గార్లతో కలిసి పనిచేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుత కామారెడ్డి జిల్లా భిక్నూరు మండలం బస్వాపూర్ గ్రామంలో వెంకయ్య, రాజమ్మ దంపతులకు 1963 ఫిబ్రవరి 5న జన్మించారు.
ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతి గృహంలో వసతి పొందుతూ సిటీ కాలేజిలో బిఏ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి కాగానే తెలుగుదేశం పార్టీలో చేరారు.
1887లో బస్వాపూర్ సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికయ్యారు. బిక్నూర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
1994లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
1999 లో ఉమ్మడి నిజామాబాద్ టిడిపి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
2000లో టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.
2009లో కామారెడ్డి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2011లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
2012లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ పై కామారెడ్డి ఎమ్మెల్యేగా మూడో సారి గెలిచారు.
2014లో కామారెడ్డి నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ తొలి అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా నియామకం అయ్యారు.
2018లో కామారెడ్డి నుంచి నాలుగో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో విప్ గా కొనసాగారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో గోవర్థన్ గారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు.
రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడంతోపాటు, పెరిక సంఘం కార్యక్రమాల్లో కూడా గోవర్థన్ గారు చురుగ్గా పాల్గొన్నారు.
కోకాపేటలో పెరిక కులానికి ప్రభుత్వం నుంచి స్థలం తీసుకురావడానికి కృషి చేశారు.
శ్రీరాం భద్రయ్య గారు రాజకీయ నాయకుడిగా, ప్రజా ప్రతినిథిగా, పెరిక సంఘం నాయకుడిగా విశిష్ట సేవలు అందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం పెద్ద వంగర గ్రామంలో సత్తయ్య, లలితమ్మల దంపతులకు 1954 డిసెంబర్ 14న మొదటి సంతానంగా జన్మించారు.
రాజకీయాల పట్ల ఆసక్తితో 1983లో తెలుగుదేశం పార్టీలో చేారారు. ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు.
1995లో వరంగల్ జిల్లా నెక్కొండ జడ్పీటిసిగా విజయం సాధించి, వరంగల్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1999 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పెరిక సంఘం నాయకుడిగా విశిష్ట సేవలు అందించారు.
2015 నుంచి 2019 వరకు తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 నుంచి 2025 వరకు పెరిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా పని చేశారు. 2025 నుంచి పెరిక సంఘం ముఖ్య సలహాదారులుగా సేవలు అందిస్తున్నారు.
స్వాతంత్ర సమరయోధులు, సమాజ సేవకుడు, దూర దృష్టి గల నాయకులు అంకతి మల్లయ్య గారు. అంకతి లక్ష్మయ్య- రామలక్క దంపతులకు జన్మించిన ఆయన సికింద్రాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకొని పెరిక సమాజ అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసినారు.
1972- 74 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన నాయకత్వంలో సంఘానికి కొత్త దిశను చూపించినారు. సంఘం బలోపేతమై పెరికకుల గౌరవం రాష్ట్రస్థాయిలో ప్రతిష్ట పొందింది.
1972 సంవత్సరంలో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా సన్మానం పొందటం ఆయన సేవలకు ప్రత్యేక గుర్తింపు వచ్చినది.
పెరిక విద్యార్థి వసతి గృహమునకు ఖైరతాబాద్ నిర్మాణ దశలో సేవలందించినారు
స్వాతంత్ర సమరయోధుడిగా దేశ సేవలోనూ , సమాజ నాయకుడిగా కుల సేవ లోను ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం.
1990 జనవరి 18న శ్రీ అంకతి మల్లయ్య గారు స్వర్గస్తులైనారు.
కీ. శే. చింతల యలమంద గారు మాజీ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెరిక కుల సంఘం మరియు పెరిక విద్యార్థి వసతిగృహం ఖైరతాబాద్ ప్రధాన కార్యదర్శి గా సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిక కుల సంఘ చరిత్రలో చిరస్మరణీయమైన నాయకుడు పెరిక కులానికి ఆత్మీయులు, సేవా తత్పరులు నిస్వార్ధ సమాజ సేవకులు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు1992-95 మధ్యకాలంలో పెరిక కుల సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించి సంఘ బలోపేతానికి విశేష కృషి చేసినారు.
ఖైరతాబాద్ లోని పెరిక విద్యార్థి వసతి గృహమునకు 1997-2002, 2003- 2005, 2005-2007,2007-2009 వరకునాలుగు సార్లు ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించటం ఆయన సేవలకు నిదర్శనం. పెరిక హాస్టల్ భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసినారు. సుమారు 40 సంవత్సరములు పెరిక సంఘానికి, పెరిక హాస్టల్ అభివృద్ధికి సుదీర్ఘ సేవలందించడం ఆయన సమాజ నిబద్ధతకు ఆయన ప్రత్యేకత
పరమపదించిన తేదీ: 13.09.2020న ఆయన స్వర్గస్తులైన వార్త పెరిక సమాజానికి తీవ్ర విషాదాన్ని కలిగించింది.
పెరిక కుల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయులలో కీర్తిశేషులు అచ్చ బాలరాజయ్యగారు ఒకరు.
అచ్చ బాలరాజా గారు 1931లో నిజామాబాద్ జిల్లా ప్రస్తుత కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలో అచ్చ రాజయ్య శ్రీమతి లక్ష్మమ్మ దంపతులకు జన్మించినారు వారి తండ్రి రాజయ్య గారు దోమకొండ గ్రామములో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయినారు విద్యపై గాడమైన విశ్వాసం కలిగిన రాజయ్య గారు తమ కుమారుడు అచ్చా బాలరాజయ్య గారిని అదే పాఠశాలలో చేర్పించి ఉన్నత విద్యను అభ్యసించినారు
అచ్చ బాల రాజయ్య గారు స్వగ్రామం దోమకొండ నుంచి హైదరాబాద్ కి 1950 లొ వచ్చి అక్కడే స్థిరపడినారు అచ్చ బాల రాజయ్య గారు బాల్యం దశ నుంచే ప్రతిభ కనబరిచేవారు ఉన్నత చదువులు పూర్తి చేసి ఉర్దూ అలీమ్ పట్టా పొందినారు, డిగ్రీలో అప్పటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించటం ఆయనలో విద్య పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం.
తర్వాత వాళ్ళ నాన్నగారు టీచర్గా పని చేసిన దోమకొండ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి అదే స్కూల్లో హెడ్మాస్టర్ గా సేవలు అందించి, అనేకమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినారు క్రమశిక్షణ విలువల బోధన విద్యార్థుల పట్ల ప్రేమ ఆయన ప్రత్యేకత.
హైదరాబాదుకి దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతి గృహం సౌకర్యం లేకపోవడం విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని సంకల్పంతో పెరిక విద్యార్థి వసతి గృహాన్ని నిర్మాణ ఆలోచనకు 12 మంది గౌరవ ఫౌండర్లు నిర్మాణం చేపట్టినారు అందులో గౌరవ అచ్చ బాలరాజయ్య గారు ఒకరు కావడం విశేషం
ఈ వసతి గృహం లొ చదువుకొని అనేకమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు
అచ్చ బాలరాజయ్య గారు ఉద్యోగాన్ని వదిలేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1965-70 మధ్య కాలంలో హైదరాబాద్ మునిసిపల్ ఉస్మాన్ గంజి ఏరియాలో కౌన్సిలర్ గా గెలిచి ప్రజలకు సేవలు అందించినారు
అచ్చా బాల రాజయ్య గారు మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి కి ప్రియ శిష్యుడిగా ఉన్నారు
1975 లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వర్యులు జలగం వెంగళరావు గారు ఆయనను కన్వీనర్ గా నియమించినారు ఇది ఆయనకు లభించిన గొప్ప వరంగా చెప్పాలి
అచ్చ బాలరాజయ్య గారికి ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అచ్చ బాల రాజయ్య గారు, హైదరాబాద్ హోల్ సేల్ ఫ్రూట్స్ మర్చంట్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా సేవలు అందించినారు వారి అబ్బాయిలలో ఒకరు అచ్చ శ్రీనివాసరావు గారు హోల్ సేల్ ఫ్రూట్ మర్చంట్ హైదరాబాదు వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్నారు
06.03.1999 న అచ్చ బాలరాజయ్య గారు స్వర్గస్తులైనారు ఆయన సేవ వారసత్వం నేటికీ నిలిచి ఉంది వారి కల నిజమై అనేక కుటుంబాలు వెలుగునిస్తుంది
అచ్చ బాలరాజయ్య గారి కుమారుడు అచ్చ శ్రీనివాసరావు గారు సెల్ నెం. 98 48 21 89 26