తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
పెరిక కులస్తులకు ఓ సంఘం ఉండాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిక కులస్తులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని, వారందరి సంక్షేమం కోసం పాటు పడాలనే లక్ష్యంతో 1970 దశకంలో చాలా మంది పెరిక పెద్దలు ఎంతో శ్రమించారు. వారందరినీ మన జాతి మరిచిపోకుండా గుర్తుంచుకోవాలనే లక్ష్యంతో పెరిక యుగకర్తలను పరిచయం చేయాలని రాష్ట్ర సంఘం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా పెరిక సంఘం అధ్యక్షులు గజవెల్లి సత్యనారాయణ గారు పెరిక యుగకర్తల గురించిన వివరాలను అందించారు.
జాతీయ నాయకుడుగా ఎదిగిన ఏకైక పెరిక బిడ్డ
లోకసభ మాజీ డిప్యూటీ స్పీకర్
రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్
నెహ్రూతో కలిసి స్వతంత్ర్య ఉద్యమం
లోహియాతో కలిసి సోషలిస్టు ఉద్యమం
ఇందిరాగాంధితో కలిసి ప్రభుత్వ నిర్వహణ
పార్లమెంటు నుంచి సస్పెండైన తొలి ఎంపి
క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకెళ్లిన చరిత్ర
గోడె మురహరి గారు సోషలిస్టు. పార్లమెంటేరియన్. స్వతంత్ర్య సమరయోధుడు. యావత్ పెరిక జాతి గర్వించదగిన గొప్ప నాయకుడు. సోషలిస్టు భావజాలం కలిగిన మురహరి బహుముఖ పాత్రలు నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్ లో క్రియాశీల సభ్యుడిగానే కాకుండా, ఏఐసిసి సభ్యుడిగా కూడా పనిచేశారు. జవహర్ లాల్ నెహ్రూ గారితో కలిసి స్వతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. 1948లో సోషలిస్టు వర్గం కాంగ్రెస్ నుండి వేరుపడే వరకు కాంగ్రేసులోని సోషలిష్టు వర్గానికి చెందినవాడు.
1943లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను జైలులో పెట్టింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే నేరాభియోగంతో బనారస్ జిల్లా నుండి రెండేళ్లు బహిష్కరించబడ్డాడు. 1946లో జవాహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడేవరకు ఈ బహిష్కరణ కొనసాగింది. స్వతంత్ర భారతంలో కూడా ఈయన సోషలిష్టు పార్టీ కార్యకలాపాలలో పాల్గొని మూడు సార్లు జైలు శిక్ష అనుభవించాడు. సోషలిస్టు భావజాలంతో ప్రభావితుడై, రామ్ మనోహర్ లోహియా ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. 1957 నుండి 1958 వరకు అఖిల భారత సమాజ్వాదీ యువక్ సభకు కార్యదర్శిగా, 1957 నుండి 1958 వరకు అఖిలభారత సోషలిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, 1961 నుండి 1963 వరకు సోషలిస్టు పార్టీ కేంద్ర పార్లమెంటు బోర్డుకు కార్యదర్శిగా పనిచేశారు.
1962 లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. నాటి నుంచి 1977 వరకు 13 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యడిగా కొనసాగారు. రాజ్యసభలో ఎక్కువగా ప్రజా సమస్యలు ప్రస్తావించేవారు. ప్రాంతీయ అభివృద్ధి గురించి పరిశోధనాత్మక ఉపన్యాసాలు చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి, రాజ్యసభను స్తంభింప చేయడానికి ప్రయత్నించడంతో సస్పెండ్ కూడా అయ్యారు. స్వతంత్ర్య భారతదేశంలో రాజ్యసభ నుంచి సస్సెండైన తొలి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు.
నాటి ప్రధాని ఇందిరాగాంధి ప్రత్యేకమైన చొరవతో మురహరి గారిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చేశారు. నాడు రాజ్యసభ చైర్మన్ గా ఉప రాష్ట్రపతి బిడి జెట్టి ఉండేవారు. 1972 నుంచి 1977వరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు. 1977లో విజయవాడ లోకసభ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అదే టర్మ్ లో లోకసభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. నాడు స్పీకర్ గా నీలం సంజీవరెడ్డి, ప్రధానమంత్రిగా ఇందిరాగాంధి ఉండేవారు.
గోడె మురహరి గారు 1926 మే 20న ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో జన్మించారు. ఆయన తండ్రి గోడె గంగరాజు గారు. 982 ఆగస్టు 5న న్యూఢిల్లీలో మురహరి గారు మరణించారు.
తులాబందుల నాగేశ్వరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రజా నేత, ప్రజాసేవను జీవిత ధ్యేయంగా స్వీకరించిన విశిష్ట నాయకుడు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామంలో జన్మించినారు.
1967 లో అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శాసనసభలో ప్రజల సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావించి, ప్రజాప్రతినిధిగా విశిష్ట గుర్తింపు పొందారు. రాష్ట్ర శాసనసభలొ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా ప్రభుత్వ ఖర్చుల పరిశీలన లొ కీలక పాత్ర పోషించారు.అధికార భాష సంఘ సభ్యుడిగా తెలుగు భాష అభివృద్ధికి కృషి చేశారు. వెనకబడిన వర్గాల సంక్షేమ కోసం ఏర్పాటు అయిన కమిషన్ లో సేవలందించారు. దేశ రక్షణ తదితర ముఖ్యాంశాలపై ఆకాశవాణి ద్వారా ప్రజలకు అవగాహన కనిపించే ప్రసంగాలు చేశారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు అధ్యక్షులుగా ఉన్న ఆల్ ఇండియా పంచాయతీ రాజ్ స్టడీ టీమ్ లో సభ్యులుగా పాల్గొన్నారు. వెనకబడిన వర్గాల సంక్షేమ పరిశీలనార్థం ఏర్పాటు చేసిన కాలేల్కర్ కమిషన్ కార్యక్రమాలను అనుబంధంగా సేవలందించారు. మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయమునకు ధర్మకర్తగా ఆలయ అభివృద్ధికి కృషి చేసినారు. సమాజ సేవలొ విశేష కృషి చేసినందుకు సంఘమిత్ర అనే బిరుదు అందుకున్నారు. తులాబత్తుల నాగేశ్వరావు గారు రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా సామాజిక చైతన్యవేత్త, పరిపాలన నిపుణుడు ఆధ్యాత్మిక సేవకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందినారు.
ఎంపిపి నుంచి ఎంపి వరకు 24 సంవత్సరాల పాటు ఏకధాటిగా వివిధ పదవులు నిర్వహించిన బోడకుంటి వెంకటేశ్వర్లు గారిది విశిష్ట రాజకీయ ప్రస్థానం. మాజీ ముఖ్యమంత్రులు ఎన్.టి. రామారావు, నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గార్లతో కలిసి పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.
వెంకటేశ్వర్లు గారు11.05.1956 న శ్రీమతి లక్ష్మమ్మ- సిద్దయ్య దంపతులకు జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామంలో ఏకైక సంతానంగా జన్మించారు. వారిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. చిన్ననాటి నుంచి క్రమశిక్షణ కృషి సేవా భావం అలవర్చుకున్నారు.
ప్రాథమిక విద్యను స్వగ్రామమైన బచ్చన్నపేటలో, ఇంటర్మీడియట్ జనగామలో పూర్తిచేసి అనంతరం ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ(ఎంపీసీ) అగ్రికల్చర్ పట్టా పొందారు.
రాజకీయ ప్రస్థానం గ్రామ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రజాసేవకు శ్రీకారం చుట్టినారు.
1978లో జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ గా నియమితులయ్యారు.
1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు వారు ఆ పార్టీలో చేరారు.
1987లో మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత, మొదటిసారి జరిగిన ఎన్నికల్లో బచ్చన్నపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1995 జెడ్పిటిసి ఎన్నికల్లో సంగెం మండలం నుంచి జడ్పీటిసిగా విజయం సాధించి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు.
1999లో వరంగల్ లోసభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2009లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
2015 లో కూడా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
2019లో శాసనమండలిలో చీప్ విప్ గా నియమితులైనారు.
గౌరవ శ్రీ బోడ కుంటి వెంకటేశ్వర్లు గారు సుమారు 40 సంవత్సరాల రాజకీయ జీవితం అంతట నీతి, నిజాయితీ, పారదర్శకత ల కు ప్రాధాన్యమిస్తూ ప్రజాసేవే ముఖ్యంగా పని చేశారు.
తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీల పాత్ర పోషించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ రాష్ట్రంలో పెరిక సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎంపిగా, ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తన నియోజకవర్గ అభివృద్ది నిధులను పెరిక భవన్ల నిర్మాణానికి ఉపయోగించి కులానికి సేవలు అందించారు.
శాసనసభకు ఐదుసార్లు ఎన్నికై, అసెంబ్లీలో రెండు పర్యాయాలు ప్రభుత్వ విప్ గా పని చేసిన ఏకైక పెరిక బిడ్డ గంప గోవర్థన్ గారు.
మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గార్లతో కలిసి పనిచేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుత కామారెడ్డి జిల్లా భిక్నూరు మండలం బస్వాపూర్ గ్రామంలో వెంకయ్య, రాజమ్మ దంపతులకు 1963 ఫిబ్రవరి 5న జన్మించారు.
ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతి గృహంలో వసతి పొందుతూ సిటీ కాలేజిలో బిఏ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి కాగానే తెలుగుదేశం పార్టీలో చేరారు.
1887లో బస్వాపూర్ సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికయ్యారు. బిక్నూర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
1994లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
1999 లో ఉమ్మడి నిజామాబాద్ టిడిపి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
2000లో టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.
2009లో కామారెడ్డి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2011లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
2012లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ పై కామారెడ్డి ఎమ్మెల్యేగా మూడో సారి గెలిచారు.
2014లో కామారెడ్డి నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ తొలి అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా నియామకం అయ్యారు.
2018లో కామారెడ్డి నుంచి నాలుగో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో విప్ గా కొనసాగారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో గోవర్థన్ గారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు.
రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడంతోపాటు, పెరిక సంఘం కార్యక్రమాల్లో కూడా గోవర్థన్ గారు చురుగ్గా పాల్గొన్నారు.
కోకాపేటలో పెరిక కులానికి ప్రభుత్వం నుంచి స్థలం తీసుకురావడానికి కృషి చేశారు.
శ్రీరాం భద్రయ్య గారు రాజకీయ నాయకుడిగా, ప్రజా ప్రతినిథిగా, పెరిక సంఘం నాయకుడిగా విశిష్ట సేవలు అందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం పెద్ద వంగర గ్రామంలో సత్తయ్య, లలితమ్మల దంపతులకు 1954 డిసెంబర్ 14న మొదటి సంతానంగా జన్మించారు.
రాజకీయాల పట్ల ఆసక్తితో 1983లో తెలుగుదేశం పార్టీలో చేారారు. ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు.
1995లో వరంగల్ జిల్లా నెక్కొండ జడ్పీటిసిగా విజయం సాధించి, వరంగల్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1999 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పెరిక సంఘం నాయకుడిగా విశిష్ట సేవలు అందించారు.
2015 నుంచి 2019 వరకు తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 నుంచి 2025 వరకు పెరిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా పని చేశారు. 2025 నుంచి పెరిక సంఘం ముఖ్య సలహాదారులుగా సేవలు అందిస్తున్నారు.
స్వాతంత్ర సమరయోధులు, సమాజ సేవకుడు, దూర దృష్టి గల నాయకులు అంకతి మల్లయ్య గారు. అంకతి లక్ష్మయ్య- రామలక్క దంపతులకు జన్మించిన ఆయన సికింద్రాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకొని పెరిక సమాజ అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసినారు.
1972- 74 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన నాయకత్వంలో సంఘానికి కొత్త దిశను చూపించినారు. సంఘం బలోపేతమై పెరికకుల గౌరవం రాష్ట్రస్థాయిలో ప్రతిష్ట పొందింది.
1972 సంవత్సరంలో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా సన్మానం పొందటం ఆయన సేవలకు ప్రత్యేక గుర్తింపు వచ్చినది. భారత ప్రభుత్వం నుంచి తామరపత్రం పొందినారు.
పెరిక విద్యార్థి వసతి గృహమునకు ఖైరతాబాద్ నిర్మాణ దశలో సేవలందించినారు
స్వాతంత్ర సమరయోధుడిగా దేశ సేవలోనూ , సమాజ నాయకుడిగా కుల సేవ లోను ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం.
1990 జనవరి 18న శ్రీ అంకతి మల్లయ్య గారు స్వర్గస్తులైనారు.
నల్లపు పిచ్చయ్య గారు స్వతంత్ర సమరయోధుడిగా, సామాజిక సంస్కర్తగా,సమాజ చైతన్యవంతునిగా నిలిచిన మహానుభావుడు. జులై 1915 లో మహబూబాద్ జిల్లా కందికొండ గ్రామంలో సంపన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పిచ్చయ్య గారు చిన్ననాటి నుంచి జ్ఞానం, ధైర్యం, సేవా భావం కలిగిన వ్యక్తిగా పేరుపొందారు.
వారు కందికొండ గ్రామంలో పెద్దబాలశిక్ష,మహాభారతం, రామాయణం, భాగవతం,నీతి శాస్త్రం వంటి పౌరాణిక గ్రంథాలను లోతుగా అభ్యసించి వాటిలోని పద్యాలను అనర్గళంగా పాడేవారు.
బుర్రకథలు నాటకాలలో అసాధారణ ప్రతిభను కనబరిచి. ప్రజల్లో చైతన్యం కలిగించే ఒక గొప్ప ప్రజానాయకుడిగా ఎదిగారు.
రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా గ్రామ గ్రామం తిరిగి ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందిస్తూ, బుర్రకథల ద్వారా ప్రజలను యువతను పోరాటానికి ప్రేరేపించేవారు. ఆంధ్ర మహాసభలో చేరి తర్వాత కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం పొంది గ్రామాలలో అనేకమందిని కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా చేర్పించారు. రజాకర్ల కాలంలో జైలు జీవితం గడిపిన ధైర్యవంతుడైన స్వాతంత్ర సమరయోధుడు నల్లపు పిచ్చయ్య గారు.
కేసముద్రం రైల్వే స్టేషన్ కు దగ్గర ప్రధాన కూడలిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి, విశేష ప్రజాదరణ పొందినారు. వారి ఇంటి పేరును కాంగ్రెస్ పిచ్చయ్య గారిగా మారేంత ప్రజాభిమానాన్ని చూ రుగొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు తక్కువగా ఉన్న కాలంలో మన సమాజం విద్యాపరంగా ఎదగాలి అనే మహాత్ర సంకల్పంతో హైదరాబాదులో హాస్టల్ నిర్మాణానికి ఎనలేని కృషి చేసినారు. జిల్లాలలో పర్యటిస్తూ నిధుల సమీకరణకు తన వంతు బాధ్యతను నిర్వహించినారు. మన కుల నాయకుల లను ప్రేరేపించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెరిక సంఘాన్ని స్థాపించారు. రిజిస్ట్రేషన్ చేయించారు. 1976 నుండి 1982 వరకు వ్యవస్థాపక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పెరిక సంఘం అధ్యక్షునిగా సేవలందించారు.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి పెరిక కుటుంబాలను ఏకతాటిపై తెచ్చి సమాజంలో చైతన్యం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు
హాస్టల్ నిర్మాణం,సమాజ అభివృద్ధి, యువతకు ఉపాధి, విద్యా ప్రోత్సహం, వివాహ ఏర్పాట్లు వంటి అనేక కార్యక్రమాల ద్వారా వేలాది కుటుంబాలకు ఆదర్శంగా నిలిచినారు నల్లపు పిచ్చయ్య గారు.
నల్లపు పిచ్చయ్య గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు. ఒక స్ఫూర్తి, ఒక ఉద్యమం, ఒక చైతన్యం, సమాజాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు.
ఆయన సేవలు,త్యాగం, నిబద్ధత నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.
నల్లపు పిచ్చయ్య గారి సతీమణి సత్తెమ్మ గారు. వీరికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
కుమారులు: కీర్తిశేషులు నల్లపు ఇంద్రసేన, నల్లపు మురళీధర్. నల్లపు శ్రీనివాసరావు, నల్లపు యుగంధర్, శ్రీనల్లపు జలంధర్ (అడ్వకేట్) శ్రీ నల్లపు ప్రహల్లాద ( అడ్వకేట్) గార్లు
కుమార్తెలు: కీర్తిశేషులు తిప్పని ఇందిరా, తమన శకుంతల గార్లు
నల్లపు పిచ్చయ్య గారు ది. 12-07-1988న స్వర్గస్తులైనారు.
పెరిక సంఘం మాజీ అధ్యక్షులు
కీ. శే. చింతల యలమంద గారు మాజీ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెరిక కుల సంఘం మరియు పెరిక విద్యార్థి వసతిగృహం ఖైరతాబాద్ ప్రధాన కార్యదర్శి గా సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిక కుల సంఘ చరిత్రలో చిరస్మరణీయమైన నాయకుడు పెరిక కులానికి ఆత్మీయులు, సేవా తత్పరులు నిస్వార్ధ సమాజ సేవకులు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు1992-95 మధ్యకాలంలో పెరిక కుల సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించి సంఘ బలోపేతానికి విశేష కృషి చేసినారు.
ఖైరతాబాద్ లోని పెరిక విద్యార్థి వసతి గృహమునకు 1997-2002, 2003- 2005, 2005-2007,2007-2009 వరకునాలుగు సార్లు ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించటం ఆయన సేవలకు నిదర్శనం. పెరిక హాస్టల్ భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసినారు. సుమారు 40 సంవత్సరములు పెరిక సంఘానికి, పెరిక హాస్టల్ అభివృద్ధికి సుదీర్ఘ సేవలందించడం ఆయన సమాజ నిబద్ధతకు ఆయన ప్రత్యేకత
పరమపదించిన తేదీ: 13.09.2020న ఆయన స్వర్గస్తులైన వార్త పెరిక సమాజానికి తీవ్ర విషాదాన్ని కలిగించింది.
మారిశెట్టి నారాయణ గారు పెరిక సమాజ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహానీయుడు. నారాయణ గారు సాధారణ కుటుంబంలో జన్మించి, అనేక కష్టనష్టాలు అధిగమించి సమాజ అభ్యున్నతికి లక్ష్యంగా పెట్టుకొని మహానత నాయకుడు.
వారి తల్లిదండ్రులు రాజయ్య, సత్తమ్మ గార్లు చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయినా తల్లి సత్తెమ్మ గారి ఆశీస్సులతో ధైర్య సాహసాలతో ఎదిగినారు. జీవిత పోరాటంలో వెనకడుగు వేయకుండా వ్యాపార రంగంలో ప్రవేశించి సోప్స్ (సబ్బుల ) తయారీ పరిశ్రమను స్థాపించడం ద్వారా ప్రతిభ చాటుకున్నారు.
ఆయన జీవిత లక్ష్యం వ్యక్తిగత విజయాలతో ముగియ లేదు. సమాజం ఎదగాలని, ముఖ్యంగా విద్యా ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని ఆయన హృదయంలో అగ్నిల దహించుకున్న సంకల్పం.
ఆ సంకల్పమే ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతిగృహం రూపంలో సహకారం అయింది.
హాస్టల్ స్థాపనకు మూల పురుషుడు ఆయన.
పెరిక విద్యార్థి వసతి గృహం ఏర్పాటుకు నారాయణ గారు ఒక ఫౌండర్ మాత్రమే కాదు ఆయనే మూలపురుషుడు, సృష్టికర్త, ఉద్యమకర్త,పునాది దాత.
ఆయన లేని పక్షంలో ఈ హాస్టల్ అనే ఆలోచన రూపుదిద్దుకొనేది కాదు.
ఆయన స్ఫూర్తి కృషి నాయకత్వం లేకపోతే నిర్మాణం ముందుకు సాగేది కాదు.
ఈరోజు పెరిక సమాజానికి లభించిన గౌరవం సాధ్యము అయ్యేది కాదు.
1971 లో హిమాయత్ సాగర్ గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో హాస్టల్ ఆలోచనలకు శ్రీకారం చుట్టగా 1972లో మారిశెట్టి నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హాస్టల్ నిర్మాణానికి తుది నిర్ణయం తీసుకున్నారు.
వారి నాయకత్వంలో పెరిక సమాజంలో ప్రముఖులను ఒక వేదిక పైకి తీసుకువచ్చి ముందు చూపుతో 12 మంది ఫౌండర్స్ తో ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం ఆయన దూర దృష్టికి నిదర్శనం.
హాస్టల్ సభ్యత్వం 2,151 లోగా నిర్ణయించి రెండు లక్షల రూపాయలు అతి తక్కువ కాలంలో సమీకరించటం ఆయన నాయకత్వo పటిమ సూచిస్తుంది.
విరాళాల సేకరణకు ఆయన సొంత కారు, పెట్రోలు మారిశెట్టి నారాయణ గారే ఏర్పాటు చేసేవారు.
ఖైరతాబాద్ లో 1,200 గజాలు ఎంతో విలువైన స్థలాన్ని కేవలం రెండు లక్షల 25 వేలకు సమీకరించటం మారి శెట్టి నారాయణ గారి పలుకుబడి చాతురాత్యా యానికి నిదర్శనం. భవిష్యత్తు తరాలకు విద్య ఆలయానికి వేసిన బలమైన పునాది.
హాస్టల్ నిర్మాణం మాత్రమే కాకుండా దీర్ఘకాలంగా ఆర్దిక వనరులు నిలబడేలా సృష్టించడంలో ఆయన ముందుచూపు అపారమైనది.
బ్యాంకు వారితో మాట్లాడి ఆదాయ మార్గాలను ఏర్పాటు కిరాయిల రూపంలో నిరంతరం ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించినారు.
ఆ కాలంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రముఖ రాజకీయ నాయకులు నారాయణ గారికి ఉన్న అనుబంధం అసాధారణం. ఆ పరిచయం వలన సమాజ ప్రయోజనానికి ఉపయోగించి అనేకమంది యువతకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించినారు.
మారిశేట్టి నారాయణ గారికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు తో సన్నిహిత సంబంధాలు కలిగి రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో తన ప్రభావాన్ని చాటుకున్నారు.
అలాగే హైదరాబాదులో నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో సమావేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి వద్దకు పెరిక సమాజ ప్రముఖులను తీసుకెళ్లి పరిచయం చేసిన ఆయన ప్రతిష్టకు నిదర్శనం.
మారిశెట్టి నారాయణ గారు నాయకత్వం కేవలం నిర్ణయాల్లో కాదు, అది ఒక ఉద్యమం ఒక శక్తి. ఆయన చూపిన దారిలోనే హాస్టల్ నిర్మాణం ముందుకు సాగింది.
ఆయన ఆలోచనలు సమాజానికి దిశదశ నిర్దేశం చేశాయి. మారిసెట్టి నారాయణ గారి జీవితం ప్రజాసేవకు ప్రతిరూపం ఆయన స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకం.
పెరిక కుల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయులలో కీర్తిశేషులు అచ్చ బాలరాజయ్యగారు ఒకరు. అచ్చ బాలరాజు గారు 1931లో నిజామాబాద్ జిల్లా ప్రస్తుత కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలో అచ్చ రాజయ్య- శ్రీమతి లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి తండ్రి రాజయ్య గారు దోమకొండ గ్రామములో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. విద్యపై గాఢమైన విశ్వాసం కలిగిన రాజయ్య గారు తమ కుమారుడు అచ్చా బాలరాజయ్య గారిని అదే పాఠశాలలో చేర్పించి చదివించారు.
అచ్చ బాల రాజయ్య గారు స్వగ్రామం దోమకొండ నుంచి హైదరాబాద్ కి 1950 లొ వచ్చి అక్కడే స్థిరపడ్డారు. అచ్చ బాల రాజయ్య గారు బాల్యం దశ నుంచే ప్రతిభ కనబరిచేవారు. ఉన్నత చదువులు పూర్తి చేసి ఉర్దూ అలీమ్ పట్టా పొందినారు, డిగ్రీలో అప్పటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించటం ఆయనలో విద్య పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం.
తర్వాత వాళ్ళ నాన్నగారు టీచర్గా పని చేసిన దోమకొండ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి అదే స్కూల్లో హెడ్మాస్టర్ గా సేవలు అందించి, అనేకమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినారు. క్రమశిక్షణ విలువల బోధన విద్యార్థుల పట్ల ప్రేమ ఆయన ప్రత్యేకత.
హైదరాబాదుకి దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతి గృహం సౌకర్యం లేకపోవడం విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని సంకల్పంతో పెరిక విద్యార్థి వసతి గృహాన్ని నిర్మాణ ఆలోచనకు 12 మంది గౌరవ ఫౌండర్లు నిర్మాణం చేపట్టినారు అందులో గౌరవ అచ్చ బాలరాజయ్య గారు ఒకరు కావడం విశేషం.
ఈ వసతి గృహం లొ చదువుకొని అనేకమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అచ్చ బాలరాజయ్య గారు ఉద్యోగాన్ని వదిలేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1965-70 మధ్య కాలంలో హైదరాబాద్ మునిసిపల్ ఉస్మాన్ గంజి ఏరియాలో కౌన్సిలర్ గా గెలిచి ప్రజలకు సేవలు అందించినారు.
అచ్చా బాల రాజయ్య గారు మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి కి ప్రియ శిష్యుడిగా ఉన్నారు.
1975 లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వర్యులు జలగం వెంగళరావు గారు ఆయనను కన్వీనర్ గా నియమించినారు. ఇది ఆయనకు లభించిన గొప్ప వరంగా చెప్పాలి.
అచ్చ బాలరాజయ్య గారికి ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అచ్చ బాల రాజయ్య గారు, హైదరాబాద్ హోల్ సేల్ ఫ్రూట్స్ మర్చంట్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా సేవలు అందించినారు. వారి అబ్బాయిలలో ఒకరు అచ్చ శ్రీనివాసరావు గారు హోల్ సేల్ ఫ్రూట్ మర్చంట్ హైదరాబాదు వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్నారు.
06.03.1999 న అచ్చ బాలరాజయ్య గారు స్వర్గస్తులైనారు. ఆయన సేవ వారసత్వం నేటికీ నిలిచి ఉంది వారి కల నిజమై అనేక కుటుంబాలు వెలుగునిస్తుంది.
శ్రీ పతిపాక బాలరాజయ్య గారు 1926 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలోని పెండర్ఘాస్ట్ రోడ్ ప్రాంతంలో జన్మించారు. చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి చూపుతూ మంచి విద్యాభ్యాసం చేశారు. ఆయన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఆ కాలంలోనే ఉన్నత విద్యావంతుడిగా పేరు పొందారు.
యువకుడిగా ఉన్న సమయంలో భారత స్వాతంత్ర్యోద్యమ ప్రభావం ఆయనపై ఎంతో ఉంది. తన విద్యా జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా మార్చి, స్వాతంత్ర్య సమర కాలంలో భారతీయులలో చైతన్యం కలిగించేందుకు కృషి చేశారు. దేశభక్తి, సామాజిక చైతన్యం ఆయన వ్యక్తిత్వంలో ప్రత్యేక లక్షణాలు.
సామాజిక సేవా దృక్పథంతో, ఆయన కైథాబాద్లో స్థాపించబడిన పెరిక విద్యార్థి వసతి గృహం (Perika Vidyarthi Vasathi Gruham, Kaithabad) స్థాపక సభ్యులలో ఒకరుగా (12 మంది స్థాపకుల్లో ఒకరు) విశేష పాత్ర పోషించారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి.
వృత్తిరీత్యా ఆయన టెక్స్టైల్ రంగంలో ప్రముఖ హోల్సేల్ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్స్టైల్ సరుకు సరఫరా లోపం ఉన్న సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించి హైదరాబాద్ను టెక్స్టైల్ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహించారు.
అతను Secunderabad Cloth Merchants Association (SCMA) కు 10 సంవత్సరాలకు పైగా General Secretaryగా సేవలందించారు. అలాగే Federation of Andhra Pradesh Chambers of Commerce and Industry (FAPCCI) సభ్యునిగా కూడా వ్యవహరించారు.
ప్రభుత్వం టెక్స్టైల్పై ఎంట్రీ ట్యాక్స్ విధించినప్పుడు, వ్యాపార వర్గాల ప్రయోజనార్థం పోరాడి ఆ ప్రభుత్వ ఉత్తర్వును (GO) రద్దు చేయించడంలో ఆయన ముందుండారు. వ్యాపారాభివృద్ధి ఆయన ప్రధాన ధ్యేయం. “రాష్ట్ర వ్యాపారానికి మరింత వస్తుసరఫరా అందించాలి” అనే ఆయన మంత్రం టెక్స్టైల్ రంగ అభివృద్ధికి దోహదపడింది.
1965 నుండి 1970 వరకు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రియాశీలక సభ్యునిగా పనిచేశారు. ఆ కాలంలో ప్రముఖ నాయకుడు T. Anjaiah గారితో ఆయనకు కుటుంబసంబంధం వంటి ఆత్మీయ అనుబంధం ఉండేది. అనేక రాజకీయ నాయకులకు ఆయన సలహాదారుడిగా మార్గనిర్దేశం చేశారు.
సామాజిక సేవకుడిగా మాత్రమే కాకుండా, ఆయన ఒక ఆదర్శ తండ్రిగానూ నిలిచారు. ప్రారంభ దశలో ఆయన మూడవ కుమారుడు Pathipaka Sunil Kumar గారు దాదాపు మూడు దశాబ్దాల పాటు కుటుంబ వ్యాపార అభివృద్ధికి విశేషంగా కృషి చేసి తన వంతు సేవలు అందించారు. అనంతరం ఆయన ఐదవ కుమారుడు Pathipaka Sanjay గారు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వ్యాపారం మరియు సామాజిక సేవలో ముందుకు సాగుతున్నారు.
ఆయన 2014 సంవత్సరంలో పరమపదించారు. అయితే ఆయన వారసత్వం నేటికీ కొనసాగుతోంది. ఆయన కుమారుడు Pathipaka Sanjay గారు టెక్స్టైల్ అసోసియేషన్ సెక్రటరీగా సేవలందిస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. అలాగే సికింద్రాబాద్లోని టొబాకో బజార్ ప్రాంతంలో “సప్తగిరి టెక్స్టైల్స్ కాటన్ హౌస్” వ్యాపారం విజయవంతంగా కొనసాగుతోంది
పెట్రం కుప్పుస్వామి గారు పెరిక సమాజ చరిత్రలొ చిరస్మరణీయమైన మహనీయులు. పెరిక విద్యార్థి వసతిగృహం స్థాపనలొ 12 మంది ఫౌండర్ లలొ ఒకరుగా నిలిచి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసిన సేవామూర్తి.
పెట్రo కుప్పుస్వామి గారు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా కొండకొర్ల గ్రామంలో జన్మించారు. 1940 లో హైదరాబాదుకు వచ్చి స్వయంకృషితో జీవితం ప్రారంభించారు. బాలానగర్ ప్రాంతంలో రోజువారి వేతనంతో జీవితం ప్రారంభించ, క్రమంగా ఒక స్థాయికి వచ్చినారు.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సివిల్ కాంట్రాక్టర్ గా సేవలు అందించారు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ లో డ్రైనేజీ నిర్మాణములొ నైపుణ్యం కలిగిన అనుభవశాలి.
విద్యార్థుల సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషిచేసిన నిర్మాణ యోధుడు. హాస్టల్ నిర్మాణములొ చెమటోడ్చిన త్యాగధనుడు. సమాజ భవిష్యత్ కోసం ఆలోచించిన దూర దృష్టి గల నాయకుడు.
కష్టపడి ఎదిగి సమాజానికి తిరిగి ఇచ్చిన కృతజ్ఞతా ప్రతిరూపం. 12 మంది పౌండర్ల తో కలిసి హాస్టల్ నిర్మాణానికి అంకితభావంతో శ్రమించిన సేవా శిల్పి. కష్టాన్ని ఆయుధాoగా చేసుకొని సమాజానికి ఆశ్రయం కలిపించిన మహా నాయకుడు పెట్రo కుప్పు స్వామి గారు.
విద్యార్థుల వసతి గృహానికి వేసిన ప్రతి ఇటుకకు ఆయన త్యాగం ఉన్నది.
పెట్రం కుప్పు స్వామి గారికి నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు.
పెట్రo కుప్పు స్వామి గారి సతీమణి. సత్యనారాయణమ్మ గారు.
కుమారుల పేర్లు1, కీ.శే. పెట్రం నర్సింగరావు, కీ. శే. పెట్రo రమణారావు, కీ. శే.పెట్రం సోమేశ్వరరావు,కీ. శే.పెట్రo వినోద్ కుమార్ గారు, కుమార్తెలు శ్రీమతి సులోచన, శ్రీమతి శోభా గార్లు.
మనవడు పెట్రo శ్రీధర్ గారు మధుకాన్ ప్రాజెక్టులొ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా చేస్తున్నారు.
పెరిక విద్యార్థి వసతి గృహం స్థాపనలో 12 మంది ఫౌండర్లలో ఒకరిగా నిలిచిన విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషిచేసిన సేవా శిల్పి.
స్వగ్రామము పటాన్చెరువు ఏరియా వారు ఐదుగురు అన్నదమ్ములు. కావేటి రంగయ్య గారు చిన్నవారు. వీరికి ఐదుగురు కుమారులు. నలుగురు కుమార్తెలు, కావేటి రంగయ్య గారు స్టీల్, ఇనుము కెమికల్ రంగాలలో పరిశ్రమలు నిర్వహించినారు.
వ్యాపారంలో నిమగ్నమై ఉన్నప్పటికీ సమాజ సేవను మరువని సేవా దృక్పదo గల నాయకుడు.
పెరిక విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి చదువు కొరకు హైదరాబాద్కు వచ్చి హాస్టల్ వసతులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించి 12 మంది ఫౌండర్స్ తో కలిసి ముందడుగు వేసిన దూరదృష్టి గల నాయకుడు.
హాస్టల్ నిర్మాణంలో ఐక్యతకు ప్రత్యేక నిలిచిన సంఘటిత శక్తి రూపం ఫౌండర్స్ తో కలిసి హాస్టల్ నిర్మాణం కొరకు చెమటోడిచి శ్రమించిన నిర్మాణ యోధుడు.
హాస్టల్ నిర్మాణాన్ని తో పాటు పెరిక కుల సంఘాన్ని కూడా సేవలు అందించిన నాయకుడు కావేటి రంగయ్య గారు.
కావేటి రంగయ్య గారి సతీమణి నరసమ్మ గారు.
తల్లిదండ్రులు కావేటి రాజన్న మల్లమ్మ గార్లు దంపతులు.
కుమారులు :1.కావేటి మనోహర్ బాబు లేటు 2. కావేటి కాశీనాథ్ లేటు, 3. కావేటి ప్రభాకర్ లేటు 4. కావేటి విజయ్ కుమార్, 5. కావేటి కిషోర్ కుమార్ లేటు
కుమార్తెలు : 1. శ్రీమతి వనపర్తి ఛాయాదేవి లేటు 2. శ్రీమతి బెర్రీ కుసుమ,3. శ్రీమతి అంబటి విమల,4. శ్రీమతి ముత్తినేని శ్రీమతి
కావేటి రంగయ్య గారి అన్నదమ్ములు 1. కావేటి వీరమల్లు లేటు, 2. కావేటి ఈశ్వరయ్యలేటు, 3. కావేటి కృష్ణయ్య లేటు,4. కావేటి బాలయ్య లేటు, 5. కావేటి రంగయ్యలేటు గార్లు ఫౌండర్
అక్క చెల్లెలు :1. శ్రీమతి బేలె నాగమ్మ,2. శ్రీమతి బుద్దె దేవకమ్మ,3. శ్రీమతి అంకతి ఈశ్వరమ్మ,4. శ్రీమతి సుబురు సత్తెమ్మ గార్లు
కావేటి రంగయ్య గారి నాలుగో కుమారుడు విజయ్ కుమార్ గారు
కర్రె మల్లయ్య గారు సమాజ చరిత్రను చిరస్థాయిగా నిలిచిన మహనీయులు.
పెరిక విద్యార్థి వసతి గృహ స్థాపనలో 12 మంది పౌండరులో ఒకరిగా ఉన్నారు. వారు విద్యా సేవను సమాజ ధర్మంగా భావించిన గొప్ప వ్యక్తి .
తల్లిదండ్రులు కర్రే రామయ్య -రాములమ్మ గార్లు జన్మస్థలము బీబీనగర్.
వారు వస్త్ర వ్యాపారం కొరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడినారు. మల్లయ్య గారి వివాహము మణెమ్మ గారితో జరిగినది నాంపల్లి, నారాయణగూడ ల లో వస్త్ర వ్యాపారం చేసేవారు
పెరిక కుల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం హాస్టల్ నిర్మాణ సంకల్పములొ భాగస్వాములైనారు హాస్టల్ స్థాపనలో కీలక పాత్ర పోషించిన స్థాపక శిల్పి
సమాజాభివృద్ధి కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించిన దూర దృష్టి గల నాయకుడు. విద్యార్థుల సంక్షేమం కోసం కృషిచేసిన విద్యా సేవా మూర్తి.
కర్రే మల్లయ్య గారికి ఇద్దరు కుమారులు కీ. శే.రాధాకృష్ణ, కీ. శే.విష్ణు కుమార్ గార్లు.
విష్ణు కుమార్ గారు పెరిక విద్యార్థి వసతి గృహమునకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా 2011-13 లొ సేవలందించినారు. వీరు కాంగ్రెస్ పార్టీ లో వివిధ హోదాలలో ప్రముఖంగా సేవలందించినారు.
కర్రె మల్లయ్య గారు కుటుంబం సమాజసేవ కొనసాగుతున్న వారసత్వం, కర్రె మల్లయ్య గారి మనవడు కర్రే భాను చైతన్య ప్రస్తుతం పెరిక విద్యార్థి వసతిగృహం ఖైరతాబాద్ వర్కింగ్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కర్రె మల్లయ్య గారు సమాజ సేవలో జీవితం గడిపిన మహనీయుడు.
కర్రే మల్లయ్య గారు 1983లో స్వర్గస్తులైనారు.
కర్రి మల్లయ్య గారి మనవడు భాను చైతన్య గారు.
రామినేని బాలకృష్ణయ్య గారు సమాజ సేవకులు అంకితభావంతో పనిచేసిన మహానీయులు. పెరిక విద్యార్థి వసతి గృహం స్థాపనలో ఆయన చేసిన కృషి పెరిక సమాజ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది.
రామినేని బాలకృష్ణయ్య గారు హైదరాబాద్ నగరంలో జన్మించి, అక్కడే పెరిగినారు. వారి తల్లిదండ్రులు లక్ష్మమ్మ విఠోవ గార్లు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు
కుమారుడు: రామినేని అశోక్ కుమార్, కుమార్తెలు: 1.సంఘని లక్ష్మి ,2. బండి సునీత 3. అంకతి సంగీత
రామినేని బాలకృష్ణయ్య గారు ఖైరతాబాద్ లోని పెరిక విద్యార్థి వసతిగృహం 12 మంది స్థాపకులలో ఒకరుగా నిలిచినారు. దూరప్రాంతాల నుంచి హైదరాబాదుకు వచ్చి చదువుకునే పేద విద్యార్థులు నివాస సౌకర్యం కలిపించాలన్న మహత్తర సంకల్పంతో వసతి గృహం నిర్మాణంలో ఎంతో శ్రమించినారు.
సమయం,శ్రమ, ధనం అన్నింటిని హెచ్చించి విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమించినారు.
విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది అనే సిద్ధాంతం వారిది.
రామినేని బాలకృష్ణయ్య గారు హైదరాబాదులో హోల్ సేల్ ఫ్రూట్ మర్చంట్ కమిషన్ దారునిగా చేస్తూ ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ వారి విలువైన సమయాన్ని సమాజ సేవకు సమయం కేటాయించేవారు.
హోల్ సేల్ ఫ్రూట్స్ మర్చంట్ అభివృద్ధికి కృషి చేసినారు వ్యాపార వర్గాల్లో ఐక్యత పెంచేందుకు శ్రమ తీసుకునేవారు.
రామినేని బాలకృష్ణయ్య గారు వారి కుమారుడు రామినేని అశోక్ కుమార్ కూడా తండ్రి గారి సేవ భావాన్ని కొనసాగిస్తూ పెరిక కుల సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
అశోక్ కుమార్ గారు గత 20 సంవత్సరాలుగా ఫ్రూట్స్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా సేవలందిస్తూ వ్యాపార వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
రామినేని బాలకృష్ణయ్య గారి విద్యా ప్రాధాన్యతను గుర్తుచేస్తాయి.
వారి సేవలు పెరిక సమాజానికి ఆదర్శంగా నిలిచాయి.
రామినేని బాలకృష్ణయ్య గారు 1996లో స్వర్గస్తులైనారు.
గోపతి శ్రీరాములు గారు ప్రముఖ వ్యాపారవేత్త సమాజ సేవకుడు గా గుర్తింపు పొందిన మహనీయుడు.
గోపతి శ్రీరాములు గారు పెరిక కుల సమాజాభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేసిన సేవా తత్పరులు.
వీరి తల్లిదండ్రులు గోపతి శ్రీబాలయ్య - కృష్ణమ్మ గార్లు,. హైదరాబాద్ సమీపంలోని ఏదులాబాద్ లొ 12- 12-1928 లొ జన్మించినారు.
విద్య యొక్క ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకున్న గోపతి శ్రీరాములు గారు గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాదుకు చదువు కోసం వచ్చే పెరిక కుల విద్యార్థులు వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొని హైదరాబాదులొ వసతిగృహం నిర్మించాలని సంకల్పించినారు.
పెరిక విద్యార్థులకు సుర క్షితమైన వసతిగృహం కలి పించాలనే ధ్యేయంతో ఏర్పడిన 12 మంది గౌర పెద్దలు ఫౌండర్స గా ఏర్పడి వారితో కలిసి నిర్మాణంలో భాగస్వామి అయినారు. భవన నిర్మాణానికి విరాళాలు సేకరించటం దాతలను ప్రోత్సహించటం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు.
హాస్టల్ నిర్మాణం పూర్తయిన తర్వాత 1972-75 మధ్యకాలంలో ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతి గృహానికి మొదటి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి నారు. తన పదవి కాలంలో హాస్టల్ అభివృద్ధి విద్యార్థుల సంక్షేమం క్రమశిక్షణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించినారు. వారి నాయకత్వంలో హాస్టల్ ఒక విద్యాసేవ కేంద్రంగా అభివృద్ధి చెందింది.
పెరిక హాస్టల్ కార్యకలాపాలు పెరిక కుల సంఘ అభివృద్ధికి సేవలు అందించినారు. విద్యా పట్ల అవగాహన కల్పించడం, ఉన్నత విద్య వైపు ప్రోత్సహించటం, సమాజ ప్రయోజనం కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి పనిచేసిన గోపతి శ్రీరాములు గారు సేవలు పెరిక సమాజానికి చిరస్థాయిగా నిలిచిపోయాయి.
గోపతి శ్రీరాములు గారు పెరిక కులం ఐక్యతగా ఉండుట కొరకు మన రాష్ట్రమే కాకుండా చెన్నై, బెంగళూరు, మహారాష్ట్ర మొదలు గు రాష్ట్రాలలో పెరిక కుల సమాచారం తెలుసుకొని ఐక్యత కోసం ఆరాటపడినారు. ఆయన చేసిన కృషితో ఈ రోజున ఏన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. సమాజాన్ని ఏకం చేసిన దూరదృష్టకల మహనీయుడు గోపతి శ్రీరాములు గారు. వారి సేవలు పెరిక సమాజానికి చిరస్మరణీయం.
గోపతి శ్రీరాములు గారు సేవలను పెరిక సమాజం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో స్మరించుకుంటుంది.
వారు చిన్నతనంలోనే హైదరాబాద్ వచ్చి ఆల్విన్ మెటల్ వర్క్స్ అనే ప్రముఖ పారిశ్రామిక సంస్థలొ పని చేసినారు. అక్కడ అనుభవం గడించిన తర్వాత తాను సొంతంగా సంస్థని ఏర్పాటు చేయాలని యువతకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకొని ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఫర్నిచర్ వ్యాపారాన్ని నాంపల్లి స్టేషన్ రోడ్డు లొ ప్రారంభించారు.
ఆయన కృషి నిజాయితీ నిబద్ధత తో పనిచేయటం వల్ల అనతి కాలములోనే కస్టమర్ల విశ్వాసాన్ని పొంది ఫర్నిచర్ వ్యాపారం నాంపల్లి స్టేషన్ రోడ్ లో గోపతి ఫర్నిచర్ గా అభివృద్ధి చెందింది.
గోపతి శ్రీరాములు గారి శ్రీమతి బాణామణి గారు జీవిత భాగస్వామిగా ఒక బలమైన ఆధారంగా నిలిచినారు. వీరు ఆదర్శ దంపతులు. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
కుమారులు: గోపతి అశోక్, బాలకృష్ణ ,కీ. శే. అనుప్, సాయిబాబా, లతీష్ కుమార్ గార్లు
కుమార్తెలు : బోడపుంటి అనురాధ, చింతకుంట్ల అమరేశ్వరి గార్లు
తల్లిదండ్రులు కీ.శే. పెరిక సోమయ్య కానుగంటి- వెంకటమ్మ గారి కుమారుడు కానుగంటి లక్ష్మీ నరసయ్య - సద్గుణ గార్లు. కానుగంటి లక్ష్మీ నరసయ్య గారు సేవా తత్పరులైన మహనీయులలో ఒకరు.
కానుగంటి లక్ష్మీ నర్సయ్య గారు చిన్ననాటి నుంచే సేవాభావంతో పెరిగారు. వారి తండ్రి సోమయ్య గారు హోల్సేల్ వ్యాపారం నిర్వహిస్తూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన మన కుల బంధువులకు భోజనం వసతి సౌకర్యం కల్పించేవారు. అంతేకాకుండా బీద విద్యార్థులకు స్కూల్ ఫీజులు వసతి సౌకర్యం కల్పించేవారు.
అలాంటి సేవ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కానుగంటి లక్ష్మీ నరసయ్య గారు ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతి గృహం సాపనలో 12 మంది ఫౌండర్లలో ఒకరిగా ఉన్నారు.
పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని సంకల్పంతో హాస్టల్ నిర్మాణానికి విరాళాలు సేకరించటం, అంతేకాకుండా స్వయంగా ఆర్థిక సాయం అందించి హాస్టల్ నిర్మాణానికి విశేషంగా కృషి చేసినారు.
వారిది ఉదార స్వభావం,సేవ తత్వం, సమాజం పై ప్రేమ, ఇవన్నీ కలిసిన మహానీయుడు కానుగంటి లక్ష్మీ నరసయ్య గారు.
కామిశెట్టి అంజయ్య గారు పెరిక కుల సమాజ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయులు.
వీరు 1920 సంవత్సరంలో హైదరాబాదులోని డబల్ పుర ప్రాంతంలో జన్మించారు. వీరు వ్యాపార రంగంలో ఎంతో అనుభవం సంపాదించి మంచి స్థాయికి ఎదిగినారు.
సమాజ సేవను జీవిత ధ్యేయంగా భావించి బడుగు బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ సహాయ సహకారనందించేవారు. వారికి ప్రజలలో మంచి గౌరవం, పేరు ప్రతిష్టలు ఉండేవి. వారి సేవ తత్పరతను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించడం వారి ప్రజా సేవకు వచ్చిన గొప్ప గౌరవం.
కామిశెట్టి అంజయ్య గారు గొప్ప దైవ భక్తి గల వ్యక్తి. ముఖ్యంగా హనుమాన్ భక్తుడిగా ప్రసిద్ధి చెందినవారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా నిరుపేదలకు వస్త్ర దానం అన్నదానం నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టేవారు.
పెరిక విద్యార్థి వసతిగృహం నిర్మాణములొ కీలక పాత్ర పోషించినారు. వసతిగృహం సాధనకు ముందడుగు వేసిన 12 మంది స్థాపకుల లో ఒకరుగా నిలిచి, నిర్మాణానికి అవసరమైన విరాళాల సేకరణ, సమాజ ప్రముఖులు చేర్పించడంలోను హాస్టల్ నిర్మాణ లొ ను అపారమైన కృషి చేసినారు.
పెరిక కుల సంఘంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లొ రాష్ట్రస్థాయిలో కుల ప్రతిష్ట నిలబెట్టడంలొ ముఖ్యమైన పాత్ర పోషించినారు.
కామిశెట్టి అంజయ్య గారు సమాజానికి చేసిన సేవలు, సమాజం కోసం చూపిన అంకితభావం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయి.
కామిశెట్టి అంజయ్య- బాలమ్మ గార్ల పుణ్య దంపతులకు సంతానం.
కుమారులు కామిశెట్టి నర్సింగరావు, కామిశెట్టి ప్రకాష్, కామిశెట్టి సత్యనారాయణ, కామిశెట్టి అశోక్ కుమార్, కామిశెట్టి కృష్ణకుమార్, కామిశెట్టి వెంకటేశ్వరరావు గార్లు.
కుమార్తెలు: పద్మ,శాంతి, విజయ,హరి,ప్రమీల,భగవతి, గీత,మాధవి,
వీరిలో కామిశెట్టి నరసింహారావు గారి మంచితనానికి మారుపేరుగల సంతానం
కుమారులు శివకుమార్, శ్రీనివాస్ లు
కుమార్తెలు ఉషారాణి, సంధ్యారాణి లు
కామిశెట్టి వెంకటేశ్వరరావు గారి అనూష దంపతుల సంతానం
కుమార్తెలు :డాక్టర్ అక్షర,క్షితిక
పాయల జంగయ్య గారు ది.05.04-1944న జన్మించారు.
తల్లిదండ్రులు కీర్తిశేషులు పాయల నరసయ్య గారు - ఈశ్వరమ్మ గార్లు.
25. 05 -1962 లొ శ్రీ పాయల జంగయ్య గారి వివాహం సుజ్ఙాని దేవి గారితో జరిగినది
శ్రీ పాయల జంగయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెరిక కుల సంఘానికి, విద్యార్థి వసతి గృహం ఖైరతాబాద్ హాస్టలకి విశేష కృషి చేసిన మహనీయుడు
1971 నుంచి ఇప్పటివరకు సుమారు 55 సంవత్సరాలు పైగా వివిధ హోదాలలో నిరంతరం సేవలందింస్తున్న సేవా భావం కలిగిన నాయకుడు, సుమారు 82 సంవత్సరాల వయసు కలిగిన పాయల జంగయ్య గారు ఇప్పటికీ సేవల ను అందించటం వారి సేవా భావానికి నిదర్శనం.
కీర్తిశేషులు నల్లపు పిచ్చయ్య గారి అధ్యక్షతన శ్రీ పాయల జంగయ్య గారు ప్రధాన కార్యదర్శిగా ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెరిక కుల సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది.. శ్రీ జంగయ్య గారు రిజిస్ట్రేషన్ కొరకు విశేష కృషి చేసినారు.
శ్రీ పాయల జంగయ్య గారు పెరిక కుల విద్యార్థుల కోసం విశేష కృషి చేసిన నాయకుడు. ఖైరతాబాద్ హాస్టల్ కి జాయింట్ సెక్రటరీగా, కార్య నిర్వహణ సెక్రెటరీగా,ప్రధాన కార్యదర్శిగా,అధ్యక్షుడిగా 3 పర్యాయాలు( 6 సంవత్సరాలు) సేవల ను అందించి విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించిన నాయకుడు.
బాలికల విద్యకు ప్రాధాన్యత ఇచ్చి దిల్ శుఖ్ నగర్ వసతిగృహం ప్రారంభించడం, నాగోలులో పెద్ద భవనాన్ని అద్దెకి తీసుకొని ఎక్కువ మంది బాలికలకు వసతి కల్పించాలని లక్ష్యంతో మొత్తం 215 మంది వసతి కల్పించడం ఆయన సేవ భావానికి నిదర్శనం.
శ్రీ పాయల జంగయ్య గారు కేవలం పదవులు నిర్వహించిన నాయకుడు మాత్రమే కాదు. సంఘ ఆస్తులను అభివృద్ధి కోసం కృషిచేసి హాస్టల్ కు సంబంధించిన పన్నుల ను మినాయింపులు తీసుకొచ్చినారు.
ఉప్పల్ ప్రాంతంలో హైదరాబాద్- వరంగల్ హైవే పక్కన ధర్మకర్తల ఆమోదం మేరకు 968 గజాలు స్థలం గజం 16,500 కు తక్కువ ధరకు కొనుగోలు చేసినారు.
ఉప్పల్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో అప్పటి హోం శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు, వెనుకబడిన తరగతుల శాఖ మాత్యులు బసవరాజు సారయ్య గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ తుళ్ల దేవేందర్ గౌడ్ గారు, మన కుల రత్నాలు శ్రీ బోడ కుంటి వెంకటేశ్వర్లు పార్లమెంటు సభ్యులు గారు, శ్రీ గంప గోవర్ధన్ ఎమ్మెల్యే గారు,శ్రీరామ్ భద్రయ్య మాజీ ఎమ్మెల్యే గారు,మన కుల గౌరవ నాయకులు కుల బంధువులు ఆ భూమి పూజ కార్యక్రమానికి హాజరైనారు
అట్టి భవన నిర్మాణానికి బ్యాంకు ద్వారా 70 లక్షల రుణం తీసుకొని, గౌరవ కుల పెద్దల సహకారంతో ఐదు స్లాబులు వరకు పూర్తి చేసినారు ఆరవ స్లాబు వేసే సమయంలోపు హాస్టల్ ఎన్నికల జరిగి కొత్త అధ్యక్షుడికి బాధ్యతలు అప్పజెప్పడం జరిగినది. నిస్వార్థ సేవా భావం కలిగిన నాయకుడు విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి యువత భవిష్యత్తు కోసం కృషిచేసిన మహానాయకుడు . పదవుల కోసమే కాకుండా సేవ చేయాలనే తపనతో జీవిస్తున్న నాయకుడు నేటి తరానికి ఆదర్శ నాయకుడు గౌరవ శ్రీ పాయాల జంగయ్య గారు.
కుమారులు: శ్రీనివాసరావు - కవిత
కీ. శే. ప్రవీణ్ - సరస్వతి
శ్రీరామ్ దయానంద గారు ది. 27 -05 1949 లో జన్మించినారు. వీరి తల్లిదండ్రులు వెంకటస్వామి- శ్యామలమ్మ గార్లు స్వగ్రామం లక్డారం, పటాన్ చెరువు మండలం, సంగారెడ్డి జిల్లా.
రాజుపేట గ్రామం& మండలం నల్లగొండ జిల్లా వాస్తవ్యులు శంకరయ్య -భద్రమ్మ గార్ల పుత్రిక రాజకుమారి గారితో ది 27- 05-1973 దయానంద గారి వివాహం జరిగినది,
శ్రీరామ్ దయానంద గారు పెరిక జాతి అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్న విశిష్ట నాయకుడు,
రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడిగా 2009-2012 వరకు, పెరిక విద్యార్థి వసతిగృహం వసతి గృహం ఖైరతాబాద్ అధ్యక్షుడిగా 2019-2022 వరకు సేవలందించినారు,
వారి హాయంలో హాస్టల్ విద్యార్థులకు 50% రాయితీతో భోజనం ఏర్పాటు చేయనైనది.
విద్యార్థులు పై చదువుల కోసం వారి భవిష్యత్తు కోసం కోచింగ్ సెంటర్ కు హాస్టల్ నిధులను తీర్మానం ప్రకారం ఖర్చు చేయనైనది. (మహిళ) విద్యార్థిని ల కు హాస్టల్ వసతి కల్పించాలని ధర్మకర్త మండలి లొ తీర్మానం చేసినారు.
హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో పెరిక గర్జన పేరుతో ది 08-04- 2012 లో పెరిక మహాసభ నిర్వహించటం లక్ష మంది పైగా పెరిక కులస్తులు హాజరు కావడం రాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఆయన నాయకత్వాన్ని సామర్థ్యాన్ని తెలుపుతుంది. క్రమశిక్షణ, శాంతియుతంగా ఆ సభ విజయవంతమైంది. ఈ సభ పెరక కులస్తులలో నూతన ఉత్తేజాన్ని నింపింది, పెరిక జాతి ఉనికిని జాతి పరువు ప్రతిష్టలతో పెంపొందించింది, సంఘటిత శక్తిని దశ దిశల వ్యాపింపజేసింది.
పెరిక కుల చరిత్రలో ఇలాంటి సభ ఎప్పుడు జరగలేదు. మహాసభను విజయవంతంగా నిర్వహింంచి చరిత్రను సృష్టించిన మహా నాయకుడు దయానంద్ గారు.
ఈ మహా సభకు అప్పటి వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ మంత్రివర్యులు బసవరాజు సారయ్య గారు, మన కుల రత్నాలు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు,ఎమ్మెల్సీ బోడ కుంటి వెంకటేశ్వర్లు గారు,మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య గారు, నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ గారు, రాజ్యసభ సభ్యుడు టి దేవేందర్ గౌడ్ గారు, టిఆర్ఎస్ ప్రతిపక్ష నేత ఈటెల్ రాజేందర్ గారు, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు, ఎంపీలు పొన్నం ప్రభాకర్ గారు అంజన్ కుమార్ గారు,బిజెపి నేత కే లక్ష్మణ్ గారు, బండారు దత్తాత్రేయ గారు ఇంకా బీసీ సంఘం నాయకులు మన కుల గౌరవ నాయకులు ప్రతి జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి అదిక సంఖ్యలో హాజరైనారు.
శ్రీరామ్ దయానంద గారు మంచి మనసున్న మహా మనిషి చేతనైనంతలో పదిమందికి సహాయం చేయాలని సేవాభావం గల వ్యక్తిత్వం అయినది.
సుమారు 77 సంవత్సరాల వయసులో కూడా పెరిక కుల సంఘం సమావేశాలకు హాజరవుతూ తన సహకారాన్ని అందించటం ఆయన సేవభావానికి నిదర్శనం.
రాష్ట్ర సంఘ నాయకులు శ్రీ మద్దాలింగయ్య గారి సూచన మేరకు పరస్పర సహకార పొదుపు సంఘం స్థాపించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ సభ్యులను చేర్పించటం ఆయన గొప్ప దూరదృష్టం సూచిస్తుంది.
పరపతి సంఘం లో ఇప్పటికీ 1343 మంది సభ్యులుగా చేర్పించి బ్యాంకు నిబంధనలతో నడిపిస్తున్నారు భవిష్యత్తులో పెరికకుల కోఆపరేటివ్ బ్యాంకుగా ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
దయానంద్ గారి సేవలు పెరిక జాతికి గర్వకారణం.
సమాజ సేవకుడు దూరదృష్టి కలిగిన రాష్ట్ర నాయకుడు, ఆయన ప్రగతిశీలి, ప్రతిభాశాలి తెలంగాణ యాసలో సామాన్యుడి భాష లో తన మృదువైన మాటలతో అందరినీ ఆత్మీయంగా పలకరించే వ్యక్తిత్వం ఆయనది.
మహిళ హాస్టల్ కు శంకుస్థాపన చేసి పనులు జరుగుతున్న విషయంలో నా కల సాకారం కాబోతుందని సంతోషం వ్యక్తం చేసినారు.
వారికి ముగ్గురు కుమార్తెలు :
1. మాధవి, రమేష్( USA) 2. ప్రశాంతి,దీపక్ (USA) 3. స్మిత, MD రేడియాలజీ, రఘురాం MD గ్యాస్ట్రాలజీ హైదరాబాద్
గరిక యాదగిరి గారు రాష్ట్ర పెరిక కుల చరిత్రలో నిలిచిపోయే మహానుభావులలో ఒకరు. తన కృషి, పట్టుదల,సేవ భావంతో సమాజంలో గొప్ప నాయకుడిగా ఎదిగారు. వీరు రామన్నపేట గ్రామం, నల్లగొండ జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు బుచ్చయ్య- లక్ష్మమ్మ గార్లు. ధర్మపత్ని హేమలత గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెరిక కుల సంఘానికి రెండుసార్లు ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. సంఘ అభివృద్ధికి, సంఘాన్ని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టి, జిల్లాలలో పెరిక కుల సంఘ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉప్పల్ ప్రాంతంలో నూతన భవన ఖాళీ స్థలం కొనుగోలు విషయంలో ఆయన కృషి చేసినారు. పెరిక విద్యార్థి వసతి గృహం ఖైరతాబాద్ ధర్మకర్తగా, ఉపాధ్యక్షులుగా, విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఎంతో కృషి చేశారు. విద్య సమాజాభివృద్ధికి మార్గమని నమ్మిన నాయకుడు. బీద విద్యార్థులకు సహాయం అందించాలని కార్యక్రమాలు చేసిన నాయకుడు. అనేక సంవత్సరాలు సేవలు అందించి వారి సేవ భావాన్ని చాటుకున్నారు. గరిక యాదగిరి గారు రాజకీయ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉప్పల్ మున్సిపాలిటీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకొని విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అనేక పదవులు చేసి, ప్రజాసేవకు అంకితమై, మున్సిపల్ చైర్మన్ గా కూడా పోటీ చేసినారు. ఉప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు.
మంచి వ్యక్తిత్వం గల నాయకుడు మాత్రమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కారిచేందుకు కృషిచేసిన నాయకుడుగా గుర్తింపు పొందినారు. వ్యాపార రంగంలో కూడా ప్రతిభను చాటుకొని రాణించినారు. గరిక యాదగిరి గారు ది. 30-11-2017 న హఠాన్మరణం చెందినారు,వారి మరణం రాష్ట్ర కుల సంఘానికి తీరని లోటు. గరిక యాదగిరి వారి ధర్మపత్ని హేమలత గారి పుణ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. కుమారుల పేర్లు శివానంద్, అశ్విన్ గార్లు. కుమార్తెలు ఏడ్మా గంగాభవాని, గరిక భార్గవి గార్లు.
తల్లిదండ్రులు మద్ద శ్రీరాములు-శాంత గార్లు స్వగ్రామ దురాజపల్లి, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా. ప్రస్తుతం సూర్యాపేట మున్సిపాలిటీ.
మద్దా లింగన్న గారు పెరిక కుల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రముఖ నాయకుడు, సమాజంపై అపారమైన అభిమానం కలిగి సంఘాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆయన నాయకత్వంలో పెరిక సంఘం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ సమాజ ఐక్యతను పెంపొందిస్తుంది. పెరిక కుల ఆత్మగౌర భవన స్థలం కోసం ప్రభుత్వం నుండి కోకాపేటలో రెండు ఎకరాల భూమి, రెండు కోట్ల నిధులు మంజూరి సాధించేందుకు గౌరవ కుల నాయకులతో కలిసి కృషి చేసినారు. ఈ ప్రయత్నం పెరిక సమాజంపై ఆయన చూపుతున్న అంకితభావానికి నిదర్శనం. పెరిక కుల పరపతి సంఘం ఆయన సలహాతో ఏర్పాటయి బ్యాంకు నియమాలతో పని చేస్తూ పరపతి సంఘాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. భవిష్యత్తులో పెరిక కుల కో-ఆపరేటివ్ బ్యాంకుగా రూపాంతరం చెందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది సమాజ ఆర్థిక బలోపేతానికి గొప్ప ముందడుగు.
మహిళా అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థిని ల హాస్టల్ కోసం ఎల్బీనగర్ లొ భూమి కొనుగోలు, భూమి పూజ నిర్మాణ కార్యక్రమాలు తన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నారు. సంక్షేమ సమితిని ఏర్పాటు చేసి 20 మంది కుల నాయకుల సహకారంతో ఒక కోటి రూపాయలు మూలధనాన్ని సమీకరించి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి అతివృష్టితో వరదల వలన ఇబ్బందులు ఎదుర్కొన్న వరద బాధిత కుటుంబాలకు అత్యవసర సహాయం కింద నిత్యవసర సరుకులు ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం వంటి కార్యక్రమాలు సంఘపరంగా చేస్తున్నారు. ఉప్పల్ ప్రాంతంలో పెరిక హాస్టల్ నిర్మాణం కోసం 968 గజాలు భూమి కొనుగోలు విషయంలో ఆయన తీసుకున్న శ్రమ ఎంతో గొప్పది.
కోకాపేట ఆత్మగౌరవ నిర్మాణాన్ని ఇప్పటివరకు నాలుగు స్లాపులు పూర్తిచేసుకుని ఐదవ స్లాబ్ కి సిద్ధంగా ఉంది, మద్దా లింగన్న గారు, వారి టీమ్ మరియు కుల అభిమానంతో,నమ్మకంతో విరాళాలు ఇచ్చిన దాతల సహకారంతో ఏడు స్లాబులు వరకు వేయాలనే సంకల్పంతో ఉన్నారు ఇది వారి దూర దృష్టికి నిదర్శనం.
మద్దా లింగన్న గారు వ్యాపార రంగంలో కూడా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు వారి తల్లిదండ్రుల పేరుతో శ్రీ శాంతిరాం కన్స్ట్రక్షన్ సంస్థను స్థాపించి తన సోదరుడు నరసయ్య గారితో కలిసి విజయవంతంగా నిర్వహిస్తున్నారు వేలకోట్ల టర్న్ వర్ తో నడుస్తున్న ఈ సంస్థను చూసుకుంటూనే సమాజ సేవకు సమయం కేటాయించడం ఆయన అంకితభావానికి నిదర్శనం
2012 -2014, 2019 -2022 మరియు 2022 -2025 వరకు సుమారు 8 సంవత్సరాలు పెరికకుల రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా కులాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ తరం యువతకు మార్గదర్శకంగా నిలిచినారు. నిస్వార్ధ సేవ, దూర దృష్టి, నాయకత్వ లక్షణాలు కలిగి సమాజానికి ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు మద్దా లింగన్న గారు. ఇలాంటి గొప్ప నాయకుడి సేవలు పెరిక జాతికి స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో పెరిక సమాజం మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము.